వ్యవసాయ బిల్లు ఆమోదం సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినందుకు 8 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. రాజ్యసభలో ఆదివారం వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ ముందు మైక్ లాగేందుకు యత్నించారు. ఇంకొందరు అక్కడున్న పత్రాను చించేశారు. ఇదిలా ఉండా ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తోసిపుచ్చారు. దీంతో అనుచితంగా ప్రవర్తించిన 8 మంది సభ్యులను వారం రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.