Narendra Modi : ఈరోజుతో సర్వేల పర్వం సమాప్తమైంది . ఇక ఎవరూ సర్వేల పేరుతో ప్రజల ముందుకు రాలేరు. ఎందుకంటే ఎన్నికల నిబంధనలు వర్తిస్తుంది. ఈరోజు 5 గంటల నుంచి సర్వేలన్నీ బంద్. సర్వేలు బంద్ అయిపోయి ఎన్నికలు షురూ అవుతాయి.
ఒకటిన్నర నెలలు ఇక సర్వేలు మాట్లాడడానికి లేదు. ఎన్నికలు, ప్రచార సరళి.. నియోజకవర్గాల్లో ఎలా ఉండబోతుందన్నది మాట్లాడాల్సి ఉంటుంది.అందుకనే అన్ని సర్వే సంస్థలు నిన్నటికి నిన్న ఫైనల్ సర్వే ప్రకటించారు.
పెద్ద పెద్ద సంస్థలన్నీ సర్వేలు చేసి రిలీజ్ చేశారు. ఇండియా టీవీ, న్యూస్ ఎక్స్, టైమ్స్ నౌ, ఏబీపీ లాంటివి సర్వేలు చేసి రిలీజ్ చేశారు. ఇన్ని సర్వేలు వచ్చినా కేంద్రంలో మోడీ తిరిగి ప్రధానిగా అవుతారని కుండబద్దలు కొట్టాయి.
మోడీ నే తిరిగి ప్రధాని నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.