Kerala : మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరూ కేరళ ప్రచారంలో

మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరూ కేరళ ప్రచారంలో తీరుతెన్నులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : April 16, 2024 6:26 pm

Kerala : కేరళ ఎన్నికలకు ఇంకా 10 రోజులే ఉంది. కాబట్టి వాడి వేడి మొదలైంది. తమిళనాడులో ప్రచారం ముగుస్తోంది. కేరళలో మొదలైన ప్రచార పర్వం జోరందుకుంది. రాహుల్ గాంధీ, మోడీ విస్తృతంగా పర్యటిస్తున్నారు. మోడీ నిన్న రెండు మీటింగ్ లకు హాజరయ్యారు. ఒకటి త్రిసూర్ దగ్గర.. రెండోది తిరువనంతపురం దగ్గర సభల్లో మాట్లాడారు.

మలయాళ మనోరమ.. లార్జెస్ట్ సర్య్కూలేటెడ్ డైలీ ఇన్ కేరళ. దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అయితే ఈ పత్రిక ప్రో యూడీఎఫ్. ప్రో క్రిస్టియన్ మిషనరీస్.. ఈ రెండు మలయాళ మనోరమకు వెన్నుదన్నుగా ఉన్నాయి.

మలయాళ మనోరమ ప్రతి పార్లమెంట్ లో సర్వే చేశారు.గెలుపోటములపై సర్వే చేసి ప్రచురించారు.2019లో లాగా ఈసారి కూడా యూడీఎఫ్ గంపగుత్తగా సీట్లు గెలుచుకోబోతోంది. అయితే కొన్ని హోరాహోరీ నియోజకవర్గాలున్నాయి. 2019తో పోలిస్తే 2024కు గణనీయంగా ఓట్లు తగ్గుతాయని పేర్కొంది. యూడీఎఫ్ కు పోయినసారి వచ్చిన ఓట్ల శాతం ఈసారి రాదని తేల్చారు. ఎన్డీఏ కూటమికి, అక్కడి జనసేన పార్టీకి గణనీయంగా ఓట్లు పెరుగుతాయని తేలింది.

మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరూ కేరళ ప్రచారంలో తీరుతెన్నులపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.