Annamalai : అన్నామలై కి దేశ వ్యాప్తంగా పెరుగుతున్న క్రేజ్ తో ద్రవిడ వాదులు

అన్నామలై కి దేశవ్యాప్తంగా పెరుగుతున్న క్రేజ్ తో ద్రవిడ వాదులు తట్టుకోలేకపోతున్న తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : May 16, 2024 6:47 pm

Annamalai : అన్నామలై ప్రస్తుతం ముంబైలో ఉన్నారు. అక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. వివిధ అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తున్నారు. అక్కడ కూడా క్రేజ్ తగ్గలేదు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ లో అంతటా అన్నామలైకి క్రేజ్ ఉండడం విశేషం.

ఇంత షార్ట్ టైంలో ఇంత క్రేజ్ ఉన్న నేతను ఎప్పుడూ చూడలేదు. అన్నాడీఎంకే, డీఎంకే నేతలు ఈ అన్నామలై క్రేజ్ ను చూసి తట్టుకోలేకపోతున్నారు. అన్నామలై క్రేజ్ తగ్గించే పనులు మొదలుపెట్టారు. భరించలేకపోతున్నారు. అరికట్టాలని ప్రయత్నించారు.

అన్నామలై పై కేసులు పెట్టి డీఎంకే బెదిరించినా వెనక్కి తగ్గకుండా పోరాడుతున్నారు. మరో కేసును అన్నామలైపై తాజాగా పెట్టారు.

డీఎంకే దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి పీకే శేఖర్ బాబు అయ్యిండి సనాతన నిర్మూలన సదస్సులో ఎలా పాల్గొంటారని అన్నామలై ప్రశ్నించారు. దీనిపై నిరసన తెలిపారు. ఈ నిరసన లో పాల్గొని అన్నామలై ప్రసంగించారు. దీనిపై డీఎంకే ప్రభుత్వం కేసు పెట్టారు.

అన్నామలై కి దేశవ్యాప్తంగా పెరుగుతున్న క్రేజ్ తో ద్రవిడ వాదులు తట్టుకోలేకపోతున్న తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.