Maharashtra municipal Election: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. ఈ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక పార్టీ విజయమో, మరో పార్టీ ఓటమో కాకుండా.. రాబోయే కాలంలో మహారాష్ట్ర రాజకీయం ఏ దిశగా సాగబోతుందో స్పష్టమైన సంకేతాలను ఇచ్చాయి.
ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సాధించిన అద్భుతమైన స్ట్రైక్ రేట్ రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచింది.
మహారాష్ట్రలోని ఐదు కీలక ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును నిరూపించుకుంది. ప్రాంతాల వారీగా స్ట్రైక్ రేట్ చూస్తే:
విదర్భ (నాగపూర్, అమరావతి): ఇక్కడ బీజేపీ అత్యధికంగా 72 శాతం స్ట్రైక్ రేట్తో క్లీన్ స్వీప్ చేసింది.
నార్త్ మహారాష్ట్ర (నాసిక్): ఇక్కడ 68 శాతం స్ట్రైక్ రేట్తో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
కొంకణ్ (ముంబై చుట్టుపక్కల ప్రాంతాలు): కోస్తా తీర ప్రాంతమైన కొంకణ్లో 65 శాతం నమోదు చేసింది.
వెస్ట్రన్ మహారాష్ట్ర (పుణే ప్రాంతం): రాజకీయంగా అత్యంత కీలకమైన ఈ ప్రాంతంలో 58 శాతం సాధించింది.
మరఠ్వాడ: ఇక్కడ 45 శాతం స్ట్రైక్ రేట్ సాధించినప్పటికీ, ఇతర పార్టీలతో పోలిస్తే మెరుగైన ప్రదర్శనే చేసింది.
మొత్తంగా చూస్తే, మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 63 శాతం ఓవరాల్ స్ట్రైక్ రేట్ సాధించడం సామాన్యమైన విషయం కాదు. ఇది ఆ పార్టీకి రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలుస్తుంది.
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికాయి. ముఖ్యంగా ముంబై, పుణే, నాసిక్, నాగపూర్ వంటి నగరాల్లో బీజేపీ జైత్రయాత్ర ఆ పార్టీకి భవిష్యత్తుపై కొండంత భరోసానిచ్చింది. విపక్షాలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరాన్ని ఈ ఫలితాలు నొక్కి చెబుతున్నాయి.
రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన మహారాష్ట్ర ఎన్నికలు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.