Telangana: కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలిసి జనానికి చెవిలో పూలు పెడుతున్నాయి

కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలిసి జనానికి చెవిలో పూలు పెడుతున్నాయి.. తెలంగాణ అసెంబ్లీలో చర్చపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : July 29, 2024 8:57 pm

Telangana : తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ సంస్కరణలు, విద్యుత్ అంశంపై వాడివేడి చర్చ జరుగుతోంది. ఆ చర్చ గంటల కొద్దీ జరుగుతోంది. ప్రధానంగా నువ్వు దొంగ నువ్వు దొంగ అన్నట్టుగా చర్చ సాగుతోంది. ప్రజలకు ఇదే వినాలంటే తల నొప్పి వస్తోంది.

మధ్యలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి మాట్లాడిన మాటలు ప్రజలకు రిలీఫ్ ఇచ్చాయి. ఎంతో పరణతితో మాట్లాడాడు. జనం మాటలు చెప్పుకొచ్చాడు. జనం గుండెచప్పుడు వినిపించాడు. ఆ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల వెతలు, తాత్కాలిక ఉద్యోగుల బాధలు చెప్పుకొచ్చాడు.

స్మార్ట్ మీటర్ లు పెట్టడం అంటే సబ్సిడీలు ఎత్తివేయడమా? అని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రశ్నించి అందరి నోళ్లు మూయించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలిసి జనానికి చెవిలో పూలు పెడుతున్నాయి.. తెలంగాణ అసెంబ్లీలో చర్చపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.