#RC15 Update: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా మొదటి రెండు షెడ్యూల్స్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రం మూడో షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ఈ కొత్త షెడ్యూల్ ను శంకర్ అండ్ రామ్చరణ్ టీం ఈ రోజు నుంచి అమృత్ సర్ లో స్టార్ట్ చేసింది.
అమృత్ సర్ లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్స్ లో రామ్ చరణ్ పై ఫైటింగ్ సీన్స్ ను చిత్రీకరించనున్నారు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ రాజకీయ నేతగా కనిపించనున్నాడు. అతనికి జోడీగా కియారా అద్వాణీ నటిస్తోంది. నిజానికి ఈ షెడ్యూల్ జనవరి నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో చేయాలి. అయితే, అప్పుడు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉండటంతో తప్పక షూటింగ్ పోస్ట్ ఫోన్ చేశారు.
ఆ తర్వాత మార్చిలో ప్లాన్ చేశారు. మళ్ళీ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో చరణ్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అందుకే.. మళ్ళీ పోస్ట్ ఫోన్ చేశారు. ఎట్టకేలకు ఈ రోజు నుంచి షూట్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే గొప్ప విజువల్ సినిమాలను తీస్తూ.. పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్కెట్ తెచ్చుకున్నాడు శంకర్. అయితే, ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్లాలని ఆశ పడుతున్నాడు. వాస్తవానికి మొట్టమొదటి పాన్ ఇండియా డైరెక్టర్ శంకరే. అంత అద్భుతమైన రికార్డు ఉంది ఆయనకు.
ఇక ‘రామ్ చరణ్ తో చేస్తోన్న ఈ భారీ బడ్జెట్ సినిమాని పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా పై నేషనల్ వైడ్ గా విపరీతమైన బజ్ ఉంది. అన్నట్టు ఈ భారీ పాన్ ఇండియా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ద గ్రేట్ మ్యూజిక్డై రెక్టర్ రహమాన్ మ్యూజిక్ అందించబోతున్నాడు.
ఇక ఈ సినిమాలో మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ ‘అరవింద స్వామి’ మెయిన్ విలన్ గా నటించబోతున్నాడు. నిజానికి చరణ్ తో ఇప్పటికే అరవిందస్వామి ‘ధ్రువ’ సినిమాలో నటించాడు. ఈ కాంబినేషన్ బాగా సక్సెస్ అయ్యింది కూడా. ఇప్పుడు మరోసారి ఈ కలయికలో మరో భారీ సినిమా వస్తోంది అనేసరికి ఫ్యాన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read More