HomeజాతీయంHyundai post Controversy: ‘హుండాయ్’ కార్లను బహిష్కరించాలని ఎందుకు ఆందోళన చేస్తున్నారు..?

Hyundai post Controversy: ‘హుండాయ్’ కార్లను బహిష్కరించాలని ఎందుకు ఆందోళన చేస్తున్నారు..?

Hyundai post Controversy:  ప్రముఖ కార్ల కంపెనీ ‘హుండాయ్’ పై సోషల్ మీడియాలో వార్ సాగుతోంది. #BoycottHundai అనే పదం ట్రెండింగ్ గా మారింది. ఇండియాలో ‘హుండాయ్’ కార్లను ఎవరూ కొనుగోలు చేయొద్దని పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ వార్ మొదలవ్వడానికి పాకిస్తాన్ వేదికగా పెట్టిన కొన్ని పోస్టులే కారణమని తెలుస్తోంది. ట్విట్టర్లో కాశ్మీర్ పై కొందరు పోస్టులు పెట్టడంతో అవి వైరల్ గా మారాయి. కానీ ఇండియాలో మాత్రం వివాదంగా మారాయి. అయితే ఇండియాకు చెందిన హుండాయ్ మాత్రం భారతీయుల మనోభావాలను గౌరవిస్తామని, ఎవరో పెట్టిన పోస్టుకు తాము బాధ్యులం కాదని వివరణ ఇచ్చింది. ఇంతకీ ఈ ‘హుండాయ్’ కంపెనీ వివాదామేంటి..? ఎందుకు కార్లను బహిష్కరించమంటున్నారు…?

‘హుండాయ్’ కంపెనీకి చెందిన యూనిట్లు పాకిస్తాన్లోనూ ఉన్నాయి. ఇక్కడి యూనిట్ల పేరు మీద ఈనెల 5న ట్విట్టర్లో కొందరు పోస్టులు పెట్టారు. ఇందులో కాశ్మీర్ స్వాతంత్రానికి మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ పోస్టులు పాకిస్తాన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అయితే పోస్టులు వైరల్ కావడంతో ఇండియాకు పాకింది. దీంతో ఈ పోస్టులు పెట్టిన హుండాయ్ కార్లను బహిష్కరించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ట్విట్టర్లో ‘కియా మోటార్స్ క్రాస్ రోడ్స్ -హైదరాబాద్’ అనే పేరుతో ఈ పోస్టు ఉంది. ‘కశ్మీర్ స్వేచ్ఛ కోసం మనమంతా కలిసి కట్టుగా ఉందాం’ అని అందులో పేర్కొన్నారు.

అంతేకాకుండా హుండాయ్ అధికారిక ఖాతా నుంచి కూడా ‘మన కాశ్మీరీ సోదరుల త్యాగాలను స్మరించుకుందాం.. వారి పోరాటాన్ని కొనసాగించడానికి మద్దతు ఇద్దాం’ అని పోస్టు పెట్టారు. దీంతో ఈ ట్వీట్లపై ఇండియన్ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇండియాలోని హుండాయ్ కంపెనీకి చెందిన కార్లను వాడొద్దంటూ ప్రచారం చేస్తున్నారు. జాక్ రెడ్డి అనే వ్యక్తి ‘హుండాయ్, కియా కంపెనీలు కశ్మీర్ కు స్వాతంత్రం ఇవ్వాలని అడుగుతున్నాయి.. అంటే నా కారును అమ్మేసే సమయం వచ్చింది..’ అని పోస్టు పెట్టారు. రాటి హెగ్డే అనే ఖాతాదారుడు ‘హుండాయ్ గ్లోబల్, కశ్మీర్ విషయంలో ఒక పక్షం వైపు వెళ్లడంలో మీ ఉద్దేశం ఏంటి..?’ అని పబ్లిష్ చేశాడు.

ఈ ఆరోపణలపై ఇండియాకు చెందిన హుండాయ్ యూనిట్ స్పందించింది. ఈ పోస్టుకు, కంపెనీకి ముడిపెట్టడం సరికాదని తెలిపింది. ‘ఇండియాలో హుండాయ్ 25 సంవత్సరాలుగా భారతీయ మార్కెట్ కు కట్టుబడి ఉంది. ఇక్కడి బలమైన జాతీయవాద విలువలను గౌరవిస్తాం. ఈ పోస్టును హుండాయ్ కంపెనీతో లింక్ చేయడం దారుణం. బాధ్యతారహితమైన కమ్యూనికేషన్ ను మేం సహించం. భారతదేశం పట్ల మేం నిబద్ధతతో వ్యవహరిస్తాం’ అని కంపెనీ ప్రతినిధులు అధికారిక ఖాతా నుంచి పోస్టు చేశారు.

ఇదిలా ఉండగా కంపెనీ వివరణ ఇచ్చిన తరువాత పాకిస్తాన్ కు చెందిన ఆ పోస్టులు లాక్ అయ్యాయి. ఆ పోస్టులు ఇప్పుడు ట్విట్టర్లో కనిపించడం లేదు. అయితే హుండాయ్ కంపెనీ ప్రతినిధులు కేవలం వివరణ ఇచ్చినంత మాత్రాన సరిపోదని, ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న వారి కంపెనీలను ఇండియాలో రద్దు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరు బీజేపీ నేత కపిల్ మిశ్రా తన ట్విట్టర్ ఖాతాలో ‘హుండాయ్ కంపెనీ చేసిన ఆ ప్రకటన భారతదేశానికే అవమానకరం. ఉగ్రవాదులకు బహిరంగంగా మద్దతు ఇస్తున్న కంపెనీ అనుమతిని ఇండియాలో రద్దు చేయాలి’ అని ట్వీట్ చేశారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version