spot_img
Homeప్రత్యేకంCM KCR: సీఎం కేసీఆర్ వేయబోయే ‘మంత్రం’ అదేనా?

CM KCR: సీఎం కేసీఆర్ వేయబోయే ‘మంత్రం’ అదేనా?

CM KCR: తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అదే సమయంలో జాతీయ రాజకీయాలపై సైతం కేసీఆర్ దృష్టిసారించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ ముందుకెళుతుండటం ఆసక్తిని రేపుతోంది.

KCR
KCR

ఇన్నాళ్లు కేంద్రంలోని బీజేపీతో సానుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్న సీఎం కేసీఆర్ కొద్దిరోజులుగా విమర్శలు గుప్పిస్తున్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీని ఇరకాటంలో పెట్టారు. కేంద్రం తీరును వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ నేతలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసి రైతుల్లో సానుభూతిని పొందారు.

కేసీఆర్ రైతు పక్షపాతి అని మోదీ సర్కారు రైతు వ్యతిరేక ప్రభుత్వమని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి తెలంగాణలో విజయవంతమయ్యారు. ఆ తర్వాత నుంచి వరుసగా బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్ పై సీఎం కేసీఆర్ సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీని ఏకిపారేశారు.

బీజేపీని కూకటి వేళ్లతో పెకలించి వేస్తాననే ధోరణిలో సీఎం కేసీఆర్ ఫైరయ్యారు. దీనంతటి వెనుక సీఎం కేసీఆర్ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారు. గతంలో మాదిరిగా సీఎం కేసీఆర్ ఈసారి సెంటిమెంట్ ను కాకుండా పీకే వ్యూహాలను నమ్ముకున్నారని సమచారం.

పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ బీజేపీపై అనుసరించిన విధానాలనే సీఎం కేసీఆర్ తెలంగాణలోనూ అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. బెంగాల్లో మమత బెనర్జీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ బీజేపీ ఆమెపై వేధింపులకు దిగడంతో ప్రజల్లో ఆమెకు సానుభూతి పెరిగింది. ఈ కారణంతోనే ఆమె మూడోసారి అధికారంలోకి వచ్చారు.

తెలంగాణలోనూ బీజేపీ కేసీఆర్ తో కయ్యానికి దిగుతోంది. ఆయనకు కావాల్సింది కూడా ఇదే. దీంతోనే ఆయన ఇటీవల గవర్నర్ పాల్గొన్న రిపబ్లిక్ డే వేడుకలకు దూరంగా ఉన్నారు. గవర్నర్ ద్వారా బీజేపీ కవ్వింపు చర్యలకు పాల్పడాలని ఆయన కోరుకుంటున్నారు. తద్వారా బీజేపీపై వ్యతిరేకతోపాటు తనపై సానుభూతి రావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

అందుకే ఇటీవల ఆయన ఓ రేంజులో బీజేపీని ఓ ఆట ఆడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలు టీఆర్ఎస్ పై రెచ్చిపోతే అది తమకే లాభమని కేసీఆర్ భావిస్తున్నారట. నిజానికి తెలంగాణలో టీఆర్ఎస్ ను బలంగా ఎదుర్కొనే స్థాయిలో బీజేపీ లేకపోయినా ఆయన ఆపార్టీని టార్గెట్ చేయడం వెనుక ఇదే కారణమని తెలుస్తోంది.

For LIVE News, National Updates, India News Watch:

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Nagarjuna

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...
Music Directors

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper