Annamalai Padayatra : భారత్ – శ్రీలంక మధ్య త్వరలో భూమార్గపు వంతెన

ఇప్పటికే అన్నామలైపై అధికార డీఎంకే మీడియా, పత్రికలు విషం కక్కుతున్నాయి. తమిళనాడులో ప్రాంతీయ వాదం ఎక్కువ. దాన్ని రగిలిస్తున్నారు. స్టాలిన్ కు కూడా ఇప్పుడు బీజేపీ భయం పట్టుకుంది. అన్నామలైను చూస్తే భయపడుతున్నారు. అన్నామలై పాదయాత్ర అనేసరికి అన్ని పార్టీలు కంగారు పడుతున్నాయి.

Written By: NARESH, Updated On : July 26, 2023 3:46 pm
Follow us on

Annamalai Padayatra : తమిళనాడులో ఇంకో రెండు మూడు రోజుల్లో అంటే 28వ తేదీన అన్నామలై పాదయాత్ర మొదలుకాబోతోంది.234 నియోజకవర్గాలు మొత్తం కవర్ చేయడానికి బయలు దేరుతారు. జనవరిలో చెన్నై ముగించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది తమిళనాట పెద్ద గేమ్ చేంజర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అన్నామలైని తమిళనాడులో హీరోగా అభివర్ణిస్తున్నారు.

తమిళనాడులో బీసీకే అనే దళితుల పార్టీ ఇప్పటికే బీజేపీ రాష్ట్రాన్ని కమ్మేస్తోందని.. అందుకే ముస్లింలు, క్రిస్టియన్లు వందశాతం మా కూటమికి ఓట్లు వేయకపోతే బీజేపీ పెను ప్రమాదం పొంచి ఉందని పిలుపునిచ్చాడు. ఇదేం సెక్యూలరిజం అన్నది తెలియదు.

ఇప్పటికే అన్నామలైపై అధికార డీఎంకే మీడియా, పత్రికలు విషం కక్కుతున్నాయి. తమిళనాడులో ప్రాంతీయ వాదం ఎక్కువ. దాన్ని రగిలిస్తున్నారు. స్టాలిన్ కు కూడా ఇప్పుడు బీజేపీ భయం పట్టుకుంది. అన్నామలైను చూస్తే భయపడుతున్నారు. అన్నామలై పాదయాత్ర అనేసరికి అన్ని పార్టీలు కంగారు పడుతున్నాయి.

తమిళనాడు రాజకీయాలు.. అన్నామలై పాదయాత్రపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.