Supreme Court : నిన్నటి సుప్రీంకోర్టు తీర్పు పెనం మీద నుంచి పోయిలో పడ్డట్టుగా మారింది. ఇప్పుడున్న వ్యవస్థను రద్దు చేసి తిరిగి ఆటవిక వ్యవస్థలోకి తీసుకెళ్లింది. సుప్రీం తీర్పు చూస్తే.. ‘2017లో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో సీలింగ్ లేకుండా కార్పొరేట్ సంస్థల నుంచి ఎంతైనా విరాళం తీసుకోవచ్చనే బీజేపీ బిల్లు ఎంత మాత్రం సమర్థనీయం కాదు.’
ఇక సుప్రీంకోర్టు తీర్పు చూస్తే.. అసలు డోనర్స్ ఎవరో తెలియకుండా విరాళాలు వద్దని.. ఓటర్లకు చెప్పాలని .. ఎలక్ట్రోరల్ బాండ్స్ ను ఎవరైనా తీసుకోవచ్చన్నది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు తెలిపింది. ఏప్రిల్ నుంచి తీసుకున్న వారందరి వివరాలు బయటపెట్టమని సూచించింది. ఇప్పుడు దీన్ని రద్దు చేయమనడం ఎంత వరకూ కరెక్ట్ అనేదో తెలియదు.
సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల విరాళాలు ఇచ్చిన వారు ఇప్పుడు బయటపడుతారు. వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
సుప్రీంకోర్టు తీర్పు నల్ల ధనాన్ని అరికడుతుందా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.