Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: ఏపీ డ్రగ్స్ మూలాలు.. పవన్ కళ్యాణ్ బయటపెట్టిన సాక్ష్యాలు

Pawan Kalyan: ఏపీ డ్రగ్స్ మూలాలు.. పవన్ కళ్యాణ్ బయటపెట్టిన సాక్ష్యాలు

Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ మరోసారి పోరుబాట పట్టారు. ఏపీ డ్రగ్స్ మూలాలు బయటపెట్టే పెద్ద క్రతువును ముందుపెట్టుకున్నారు. ఈ మేరకు సంచలన ట్వీట్లతో బయటకు వచ్చారు. ఏపీ డ్రగ్స్ కు అడ్డా అని అందరూ విమర్శలు గుప్పిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ బయటపెట్టిన ఈ సాక్ష్యాలు ఇప్పుడు సంచలనమవుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఏపీలో డ్రగ్స్ దందా జరుగుతున్నది వాస్తవం అని పవన్ కళ్యాణ్ ట్వీట్లతో యుద్ధం మొదలుపెట్టారు.

pawan kalyan AOB
pawan kalyan AOB

ఇటీవల టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఏపీ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని.. వైసీపీ నేతలకు ప్రమేయం ఉందంటూ నోరుజారడంతో అది పెద్ద వివాదం అయ్యింది. పట్టాభితోపాటు టీడీపీ నేతల నివాసాలు, ఇళ్లపై వైసీపీ కార్యకర్తలు దాడులతో బెంబేలెత్తించారు. ఇక ఏపీలో డ్రగ్స్ గురించి చంద్రబాబు, ఇతర ప్రతిపక్షనేతలు గళమెత్తుతున్న వేళ ఈ పోరాటంలోకి పవన్ కళ్యాణ్ కూడా దిగారు.

జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తాజాగా సంచలన సాక్ష్యాలు బయటపెట్టారు. హైదరాబాద్ సిటీ పోలిస్ కమిసనర్ అంజనీకుమార్ ఏపీ డ్రగ్స్ ఉత్పత్తికి కేంద్రం అని విలేకరుల సమావేశంలో మ్యాప్ చూపించి మరీ వెల్లడించిన వీడియోను పవన్ ట్వీట్ చేశాడు. ఏపీలోని నర్సీపట్నం కేంద్రంగా డ్రగ్స్ దందా మొదలైందని.. ఆంధ్రా-ఒడిసా సరిహద్దుల్లో సాగవుతున్న గంజాయిని నర్సీపట్నం నుంచి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ కు వయా హైదరాబాద్ ద్వారా ఎగుమతి చేస్తున్నారని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. ఈ వీడియోను ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ నుంచే దేశం మొత్తానికి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని సంచలన ప్రకటన చేశారు. అహ్మద్ నగర్ నుంచే పుణే, ముంబై ఇతర దేశమంతా సరఫరా అవుతోందని ఆరోపించారు.

ఇక నల్గొండ ఎస్పీ రంగనాథ్ గతంలో ప్రకటన చేసిన వీడియోను కూడా పవన్ షేర్ చేశాడు. దేశవ్యాప్తంగా గంజాయి సరఫరా అవుతోంది ఏపీ నుంచే అని.. ఏపీ-ఒడిషా సరిహద్దుల్లో పెద్ద ఎత్తున గంజాయి సాగు చేస్తున్నారని రంగనాథ్ తెలిపారు. దాన్ని దేశంలోని అన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఏపీలోని డ్రగ్ సరఫరా దారులు, బ్రోకర్లు, సాగుచేసే వారు, లోకల్ నేతలు, వ్యాపారులు ఇందులో భాగస్వాములున్నారని.. ఇది వేలకోట్ల బిజినెస్ అని రంగనాథ్ తెలిపారు. ఇందులో ఏపీ నేతల హస్తం ఉందని ఆయన తెలిపారు. ఈ వీడియోను షేర్ చేసిన పవన్ కళ్యాణ్ ‘దేశానికి గంజాయి సరఫరా చేస్తోంది ఏపీ’ అని ఆరోపించారు.

ఇక ఆంధ్రా-ఒడిషా సరిహద్దుల్లో తాను 2018లో చేసిన పోరాట యాత్ర వీడియోను పవన్ పంచుకున్నారు. అక్కడ గంజాయి సాగు అవుతోందన్న విషయాన్ని వీడియోలో చూపించాడు. ఇలా పవన్ కళ్యాణ్ చేసిన మూడు ట్వీట్లు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఏపీ గంజాయి స్మగ్లింగ్ కు కేంద్రం అని సాక్ష్యాలు బయటపెట్టిన తీరు దుమారం రేపుతోంది. మరి దీనిపై అధికార వైసీపీ స్పందిస్తుందా? ఏం చేస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.

Also Read: పవన్ ‘ఉక్కు పోరాటం’ అసలు కథేంటి..?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version