Pawan Kalyan – Hyper Aadi : గత మూడు రోజులుగా జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన 2024 సార్వత్రిక ఎన్నికల్లో 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అన్ని తక్కువ సీట్లు కేటాయించడం పై జన సైనికులు మండిపడుతున్నారు. అదే సమయంలో జనసేన టికెట్స్ ఆశించిన కొందరు ఇంచార్జ్ లు వేదనకు గురవుతున్నారు. సహనం కోల్పోయిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నడూ లేని విధంగా దుర్భాషలు ఆడుతున్నారు.
ఈ క్రమంలో హైపర్ ఆది సుదీర్ఘ వీడియో విడుదల చేశాడు. పవన్ కళ్యాణ్ ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న జనసేన కార్యకర్తలకు ఆయన విలువ తెలియజేశాడు. ”కనీసం ఒక పరీక్ష ఫెయిల్ అయితే మనం పది రోజులు బయటకు రావడానికి భయపడతాం. అలాంటిది రెండు చోట్ల ఓడిపోయి కూడా రెండు రోజుల్లో ప్రజల సమస్యల మీద పోరాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎవరైనా అధికారంలో ఉంటే ప్రజలకు ఒక రూపాయి ప్రభుత్వం తరపున ఖర్చు చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉండి కూడా కౌలు రైతులకు తన సొంత డబ్బులతో సహాయం చేశాడు.
తన పిల్లల చదువులకు దాచుకున్న డబ్బులు ప్రజల కోసం ఖర్చు చేశాడు. ఎక్కువ సీట్లు తీసుకుని తక్కువ సీట్లు గెలిచే కంటే తక్కువ సీట్లు తీసుకుని ఎక్కువ చోట్ల గెలవడం మంచిదని ఆయన భావించారు. ఒక పార్టీని ఫాలో అయ్యేవాళ్ళు ఇంత ఆలోచిస్తుంటే స్థాపించిన ఆయన ఎంత ఆలోచించి ఉంటారు. 2019లో రెండు చోట్ల ఆయన్ని గెలిపించుకోలేకపోయాము. నిస్వార్థంగా రాజకీయాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తినా మీరు విమర్శించేది. కులాన్ని తాకట్టు పెట్టాడు. అమ్మడు పోయాడు అంటారా?. అలా అనుకుంటే అధికార పక్షం దగ్గరే ఎక్కువ డబ్బులు ఉన్నాయి. వాళ్లకు అమ్ముడు పోవచ్చుగా…
పొత్తు ధర్మం పాటించండి. జనసేన తరపున పోటీ చేసిన అభ్యర్థులకు ఓటు వేయండి. అలాగే తెలుగుదేశం అభ్యర్థులకు ఓటు ట్రాన్స్ఫర్ చేయండి. ధోని మొదట్లో డక్ అవుట్ అయ్యాడు. తర్వాత 24 పరుగులు చేశాడు. అనంతరం గేమ్ ఛేంజర్, విన్నర్ అయ్యాడు… అంటూ ఆది వీడియోలో చెప్పుకొచ్చాడు. హైపర్ ఆది వీడియోని నాగబాబు షేర్ చేయడం విశేషం.
I really appreciate your strong loyalty to the party and our leader.
ఒక నిజమైన జనసైనికుడు ఎలా మాట్లాడాలో అలామాట్లాడావ్ ఆది…
#wearewithyoujanasenani pic.twitter.com/YqnCB6tK3J— Naga Babu Konidela (@NagaBabuOffl) February 26, 2024