Yogi Adityanath : యోగీ ఆదిత్యనాథ్ యూపీని అగ్రగామి రాష్ట్రంగా ఎలా మారుస్తున్నాడు?

యోగీ ఆదిత్యనాథ్ యూపీని అగ్రగామి రాష్ట్రంగా ఎలా మారుస్తున్నాడు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : December 20, 2023 4:09 pm

Yogi Adityanath : యూపీ.. యోగి ఆధిత్యనాథ్ ప్రతీరోజు వార్తల్లో ఉంటున్నారు. ఒకనాడు యూపీ ఎప్పుడూ వార్తల్లో ఉండేది. మత ఘర్షణలు, ఆకలిచావుల్లో యూపీ వార్తల్లో ఉండేది. యోగి ఆధిత్యనాథ్ సీఎం అయ్యాక అభివృద్ధి పనుల్లో యూపీ వార్తల్లో నిలుస్తోంది. యూపీ సీఎంగా యోగి వచ్చాక పరిస్థితి మరింది.

రెండు రోజుల క్రితం ఒక వార్త సంచలనంగా మారింది. దేశం మొత్తం మీద అతిపెద్ద జీడీపీ రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ ఆవిర్భవించింది. SOIC.in ప్రకారం.. తమిళనాడును దాటి యూపీ వెళ్లిపోయిందని సోదాహరణంగా వివరించింది.

రాష్ట్రాల్లో జీడీపీల్లో ఎవరి వాటా ఎంత అని ఈ సర్వే సంస్థ వెల్లడించింది. ఎప్పటిలాగానే 15.7 శాతంతో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. 9.2 శాతంతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. 9.1 శాతంతో తమిళనాడు మూడో స్థానంలో.. 4వ స్థానంలో గుజరాత్, 5వ స్థానంలో బెంగాల్ నిలిచింది..

యోగీ ఆదిత్యనాథ్ యూపీని అగ్రగామి రాష్ట్రంగా ఎలా మారుస్తున్నాడు? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.