Homeజనరల్నిరుద్యోగులకు శుభవార్త.. ఇకపై అన్ని ఉద్యోగాలకు ఒకటే పరీక్ష..?

నిరుద్యోగులకు శుభవార్త.. ఇకపై అన్ని ఉద్యోగాలకు ఒకటే పరీక్ష..?

Common Eligibility Test

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ అభ్యర్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగనుంది. కేంద్ర మంత్రి జీతేంద్ర సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి ఈ విషయాలను వెల్లడించారు. మోదీ సర్కార్ తీసుకొచ్చిన గొప్ప సంస్కరణగా ఈ నిర్ణయాన్ని పేర్కొనవచ్చని ఆయన అన్నారు. నేషనల్‌ రిక్రూట్‌ ఏజెన్సీని కూడా ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.

Also Read: ప్రజలకు ఫ్రీగా వాషింగ్ మెషీన్, కేబుల్ టీవీ.. ఎక్కడంటే..?

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన వెల్లడించారు. నిరుద్యోగ అభ్యర్థులకు గతంతో పోలిస్తే రవాణా ఖర్చులతో పాటు పరీక్ష ఫీజులు కూడా భారీగా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. 2021 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ పరీక్ష జరగనుందని తెలుస్తోంది. కేంద్రమంత్రి జీతేంద్ర సింగ్‌ ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు.

Also Read: ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించవచ్చు.. ఎలా అంటే..?

నేషనల్ రిక్రూట్ ఏజెన్సీ ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలను కూడా భర్తీ చేయనుందని సమాచారం. నేషనల్‌ రిక్రూట్‌ ఏజెన్సీ ఈ పరీక్షలకు సంబంధించి స్వతంత్ర బోర్డ్ గా వ్యవహరించనుంది. నేషనల్ రిక్రూట్ ఏజెన్సీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించబోయే పరీక్షలను ఈ బోర్డ్ నిర్వహించినట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

అయితే నేషనల్ రిక్రూట్ ఏజెన్సీ ఏర్పడినా ఎస్ఎస్‌సీ , ఆర్‌ఆర్‌బీ , ఐబీపీఎస్‌ పరీక్షల నిర్వహణకు ఎటువంటి ఆటంకం ఏర్పడదని తెలుస్తోంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం గురించి నిరుద్యోగుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version