spot_img
Homeప్రత్యేకంBJP Vs Speaker: బీజేపీ వర్సెస్ స్పీకర్: హైకోర్టు చెప్పినా ‘తగ్గేదేలే’ అంటున్న పోచారం

BJP Vs Speaker: బీజేపీ వర్సెస్ స్పీకర్: హైకోర్టు చెప్పినా ‘తగ్గేదేలే’ అంటున్న పోచారం

BJP Vs Speaker: తెలంగాణలో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ ఎదుగుతుండటం ఆపార్టీకి కంటగింపుగా మారుతోంది. వరుస ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ చెక్ పెడుతుండటంతో ఆపార్టీని నేరుగా ఎదుర్కోలేక దొడ్డిదారిన దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోంది. గత సాంప్రదాయాలకు భిన్నంగా ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం పూనుకుంది. గవర్నర్ ను బీజేపీ నేతగా చిత్రీకరించేందుకు టీఆర్ఎస్ సర్కారు ప్రయత్నించడం సైతం పలు విమర్శలకు తావిచ్చింది.

BJP Vs Speaker
Telangana Assembly

అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 తేది నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ పొడియం వద్దకు బీజేపీ నేతలు దూసుకొచ్చారని, బడ్జెట్ సమావేశాలు జరగకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ స్పీకర్ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఏకంగా అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు వారిపై వేటు వేయడం ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనంగా మారిందనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.

Also Read: Pawan Kalyan Target 2024: పవన్ టార్గెట్ ఫిక్స్.. ఇక తేల్చుకోవాల్సింది చంద్రబాబే..!

ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ ఎండగడుతుందోనని స్పీకర్ వారిపై వేయడం సరైంది కాదని ప్రతిపక్ష పార్టీలు సైతం విమర్శలు గుప్పించాయి. స్పీకర్ తమపై సస్పెన్షన్ వేటు వేయడంపై బీజేపీ ఎమ్మల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రెడ్డిలను కోర్టును హైకోర్టును సైతం ఆశ్రయించారు. అసెంబ్లీ సమావేశాలు నేడు చివరి రోజు కావడంతో స్పీకర్ బీజేపీ నేతల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

హైకోర్టు సూచనల మేరకు ఈరోజు శాసన సభ ప్రారంభానికి ముందే బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లారు. హైకోర్టు ఆర్డర్ కాపీతో అసెంబ్లీ సెక్రటరీతో సమావేశమయ్యారు. అలాగే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కూడా సస్పెండైన బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. అయితే నిన్న కూడా అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ విచారణ నిమిత్తం నోటిసులిచ్చింది. వీటిని అసెంబ్లీ కార్యదర్శి తీసుకోకపోవడంపై సీరియస్ అయింది. అసెంబ్లీ కార్యదర్శకి నోటీసులు చేరేలా చూడాలని రిజిస్ట్రార్ జనరల్, హైదరాబాద్‌ సీపీ స్వయంగా చూడాలని ఆదేశించింది. దీని తదుపరి విచారణ నేడు సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది.

మరోవైపు కోర్టులకు శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం లేదని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనతో హైకోర్టు న్యాయమూర్తి షమీమ్‌‌ అక్తర్‌ ఏకీభవించారు. సభా కార్యక్రమాలకు సభ్యులు ఎవరైనా ఆటంకం కల్పిస్తే సస్పెండ్‌‌ చేసే అధికారం స్పీకర్‌‌కు ఉందని విన్నవించారు. అయితే స్పీకరే సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. సభలో ప్రజాప్రతినిధులు వుంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని కోర్టు అభిప్రాయపడింది. దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Komatireddy Venkat Reddy Meets Modi: అర‌గంట‌లోనే కోమ‌టిరెడ్డికి ప్ర‌ధాని అపాయింట్ మెంట్‌.. ఏం జ‌రుగుతోంది..?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper