Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ డే 28 హైలెట్స్… హోస్ట్ ని నిలదీసిన శివాజీ, షాకింగ్ ఎలిమినేషన్ తో మైండ్ బ్లాక్!

కానీ శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి వాయింపుడు కార్యక్రమం జరిగింది . నాగార్జున ఫైర్ అవ్వడంతో వణికిపోయారు కంటెస్టెంట్స్ . శనివారం ఎపిసోడ్ హాట్ హాట్ గా ముగిసింది.

Written By: NARESH, Updated On : October 2, 2023 10:17 am
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఫోర్త్ వీక్ వీకెండ్ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా ముగిశాయి . మరి వీకెండ్ ఎపిసోడ్స్ వచ్చాయంటే హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఆటపాటలతో సందడి చేస్తారు. కానీ శనివారం ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి వాయింపుడు కార్యక్రమం జరిగింది . నాగార్జున ఫైర్ అవ్వడంతో వణికిపోయారు కంటెస్టెంట్స్ . శనివారం ఎపిసోడ్ హాట్ హాట్ గా ముగిసింది.

ఇక సండే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం .సండే ఫన్ డే అంటూ నాగార్జున కంటెస్టెంట్స్ తో ఫన్నీ గేమ్స్ ఆడించాడు . నవ్వులతో ,డాన్సులు తో ఖుషి ఖుషి గా ఎంజాయ్ చేశారు కంటెస్టెంట్స్. అంతా బానే ఉంది కానీ శివాజీ మాత్రం శనివారం ఎపిసోడ్ లో జరిగిన దాని గురించి అసంతృప్తి గా ఉన్నాడు.కొందరు కంటెస్టెంట్స్ శివాజీ పార్షియాలిటీ గా ఉంటున్నాడు అని అతడు ఇంటి సభ్యుడిగా ఉండటానికి అనర్హుడని చెప్పారు .

దీంతో శివాజీ పవర్ అస్త్ర ని బద్దలు కొట్టమని శోభా శెట్టి కి నాగార్జున చెప్పాడు . శివాజీ నువ్వు ఇప్పుడు ఇక హౌస్ మేట్ కాదు ,కంటెస్టెంట్ మాత్రమే అని చెప్పి పవర్ బ్యాటరీ డౌన్ చేసాడు నాగ్ . ఇక ఈ విషయం గురించి సండే ఎపిసోడ్ లో శివాజీ నేను ఎందుకు ఇంటి సభ్యుడిగా ఉండటానికి అనర్హుడిని అని నాగార్జున ని ప్రశ్నించాడు. నువ్వు పార్షియాలిటీ గా ఉంటున్నావ్ అని ,బయాస్డ్ గా ఉంటున్నావ్ అని వాళ్ళు బాధ పడుతున్నారు అని బదులిచ్చాడు నాగార్జున .నేను ఏం అలా ఉండలేదన్న శివాజీ, ఒక్క సాక్ష్యం చూపించండి అన్నాడు .

శోభా నువ్వు చెప్పు అనగానే అవును సార్ నన్ను అమర్ ,ప్రియాంక విషయంలో మాట్లాడనివ్వలేదు, అమర్ ని సపోర్ట్ చేయడానికి ఒక్క రీజన్ చెప్పు అని నిలదీశారు నాగార్జున . శోభా నోరు విప్పలేదు , ఎవరి విషయంలో పార్షియల్ గా ఉన్నాడు అని నాగార్జున శోభా ని అడిగాడు దానితో ప్రిన్స్ ,ప్రశాంత్ పేరు చెప్పింది శోభా అది పార్షియాలిటీ ఎందుకు అవుతుంది ప్రిన్స్ నామినేట్ అయ్యాడు కదా, నువ్వు సందీప్ ఒక డెసిషన్ తీసుకుంటున్నారు దానికి శివాజీ కన్విన్స్ అవుతున్నాడు అని నాగార్జున అనగానే శోభా ,సందీప్ ల నోట మాట రాలేదు . కనీసం ఒక్క స్పెసిఫిక్ రీజన్ చెప్పండి అంటూ గట్టిగా నిలదీశాడు హోస్ట్ నాగార్జున.

శోభా శెట్టి వాదనలో ఫెయిల్ అయినా… నాగార్జున శివాజీని హౌస్ మేట్ చేయలేదు. ఇంటి సభ్యుల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నువ్వు కంటెస్టెంట్ వే అన్నాడు. శివాజీకి పవర్ అస్త్ర దక్కలేదు. కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడించిన నాగార్జున, ఎలిమినేషన్ రౌండ్స్ కూడా జరిపారు. ప్రియాంక, యావర్, గౌతమ్, శుభశ్రీ సేఫ్ కాగా… చివర్లో రతికా రోజ్, తేజా మిగిలారు. ఉత్కంఠ మధ్య రతికా రోజ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున తెలియజేశారు. రతికా ఎమోషనల్ గా హౌస్ వీడింది…