Bigg Boss 7 Telugu : ఎపిసోడ్ హైలెట్స్: ఎలిమినేట్ అయిన పూజ, మళ్ళీ డ్రామా మొదలుపెట్టిన రతిక, రాగానే ఆ పని!

గతంలో తప్పు చేశాను, ఇకపై చేయను అంది. శివాజీ నా బిడ్డవు నువ్వు అంటూ క్షమించాడు. బయట శివాజీ పాపులారిటీ చూసిన రతిక డ్రామా షురూ చేసిందని అంటున్నారు.

Written By: NARESH, Updated On : October 23, 2023 9:18 am
Follow us on

Bigg Boss 7 Telugu : ఆదివారం నాగార్జున దసరా స్పెషల్ ఈవెంట్ నిర్వహించాడు. ఇంటి సభ్యులతో బతుకమ్మ ఆడించాడు. హౌస్ మేట్స్ ని రెండు టీమ్స్ గా విభజించి గేమ్స్ ఆడించాడు. నాగిని డాన్స్ లో ఇరు టీమ్స్ నుండి శోభా, ప్రియాంక పోటీపడ్డారు. శోభా గెలిచింది. పోల్ డాన్స్ లో అర్జున్, అశ్విని తలపడ్డారు. అర్జున్ గెలిచాడు. బెల్లి డాన్సులో అమర్, సందీప్ పోటీకి దిగారు. సందీప్ ప్రొఫెషనల్ డాన్సర్ కాగా అతను గెలిచాడు. డ్రంక్ డాన్స్ లో భోలే, ప్రశాంత్ పోటీ పడ్డారు, భోలే గెలిచాడు. గెలిచిన వాళ్ళందరూ దాదాపు ఒకే టీమ్ కి చెందినవారు.

దాంతో శోభా టీమ్ గెలిచింది. గిఫ్ట్ గా ఇంటి సభ్యులు రాసిన లెటర్స్, స్వీట్స్ పంపాడు బిగ్ బాస్. కుటుంబ సభ్యులు రాసిన లెటర్స్ పొందిన అమర్, శోభా, యావర్, శివాజీ ఎమోషనల్ అయ్యారు. శోభా అయితే ఓవర్ యాక్షన్ చేసింది. మధ్య మధ్యలో అదిరిపోయే పెర్ఫార్మన్స్ లతో వేదిక అదిరింది. నామినేటైన హౌస్ మేట్స్ ని సొంత ఇంటి సభ్యులు వీడియోలతో సేవ్ చేసారు. నామినేషన్స్ లో ఉన్న సభ్యులు నిలుచున్నప్పుడు… స్క్రీన్ మీద ఎవరి ఫ్యామిలీ మెంబర్ వచ్చి సేవ్ అని చెబుతాడో వారు సేఫ్ అని నాగార్జున అన్నారు.

ఈ ప్రాసెస్ లో వరుసగా అశ్విని, అమర్, గౌతమ్, ప్రశాంత్, తేజా సేవ్ అయ్యారు. చివరికి పూజా, భోలే షావలి మిగిలారు. వీరిద్దరినీ మరో రూమ్ కి పిలిచిన నాగార్జున ముందు రెండు బౌల్స్ పెట్టారు. లోపల చేయి పెట్టి నేను చెప్పినప్పుడు బయటకు తీయాలి. రెడ్ కలర్ చేతికి ఉంటే ఎలిమినేట్, గ్రీన్ ఉంటే సేఫ్ అన్నాడు. భోలే, పూజ మూర్తి బౌల్స్ లో చేతులు పెట్టారు. నాగార్జున బయటకు తీయమనగా… పూజ చేతికి రెడ్ కలర్ ఉంది. దాంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

వేదికపైకి వెళ్లిన పూజ ఇంటి సభ్యుల గురించి తన అభిప్రాయం తెలియజేసింది. అనంతరం ఇంటి సభ్యులు ఓట్లు వేసిన బాక్స్ తెచ్చాడు నాగార్జున. ఎలిమినేట్ అయిన దామిని, రతిక రోజ్, శుభశ్రీలలో ఒకరు ఇంటి సభ్యుల ఓట్ల ఆధారంగా హౌస్లో మరలా అడుగుపెడతారని చెప్పిన విషయం తెలిసిందే. ఓటింగ్ అనంతరం తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లకు ఛాన్స్ అని నాగార్జున మెలిక పెట్టాడు. దాంతో రతిక రోజ్ కి ఛాన్స్ వచ్చింది. ఇక రాగానే డ్రామా మొదలుపెట్టింది. ఎవరూ లేకుండా చూసి శివాజీ కాళ్ళ మీద పడింది. గతంలో తప్పు చేశాను, ఇకపై చేయను అంది. శివాజీ నా బిడ్డవు నువ్వు అంటూ క్షమించాడు. బయట శివాజీ పాపులారిటీ చూసిన రతిక డ్రామా షురూ చేసిందని అంటున్నారు.