Anasuya Bharadwaj : ఆడపిల్లను కనాలని ఉంది.. మా ఆయన సహకరించడం లేదు.. అనసూయ బోల్డ్ కామెంట్స్‌ వైరల్

తనకు ఆడపిల్లను కనాలని ఉందని ఇటీవలే తన అత్తగారికి ఓపెన్‌గా సిగ్గు విడిచి చెప్పిందట.

Written By: NARESH, Updated On : December 13, 2023 8:33 am
Follow us on

Anasuya Bharadwaj : ఐటం గాల్‌గా, వదినగా, ఆంటీగా, అత్తగా, వ్యాంపుగా, విలన్‌గా భిన్నమాన పాత్రలతో ఆకట్టుకుంటోంది అనసూయ. న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ ప్రారంభించిన అనసూయ యాంకర్‌గా రాణించింది. తర్వాత సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంది. సినిమా అవకాశాలు పెరగడంతో యాంకరింగ్‌కు గుడ్‌బై చెప్పింది. కానీ ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో ఇప్పుడు ఆమెకు బోలెడంత ఫ్రీటైం దొరుకుతోంది. దీంతో ఫ్యామిలీ ట్రిప్స్‌కు ప్రాధాన్యం ఇస్తుంది. పెళ్లయిన తర్వాత ఇటు యాంకర్‌గా, అటు సినిమా చాన్స్‌లు దక్కించుకున్న అనసూయ సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఆ మధ్య బికినీలో భర్తతో బీచ్‌లో చేసిన సందడి మామూలుగా లేదు.

భర్త, ఇద్దరు పిల్లలు..
అనసూయకు ఎర్లీ మ్యారేజ్‌ కావడంతో ఆమె సినిమాల్లోకి వచ్చేసరికే ఇద్దరు పిల్లల తల్లి. ఒకవైపు భర్త, పిల్లలను చూసుకుంటూనే మరోవైపు యాంకర్‌గా, సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు ఫ్రీటైం దొరుకుతుండడంతో యూట్యూబ్‌ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఆమధ్య ఓ ఇంటర్వ్యూలో తాను వైన్‌ తాగుతానని ఓపెన్‌ అయింది. తప్పేముందని కూడా వ్యాఖ్యానించింది. చూసేవారి కళ్లను బట్టి తప్పు అనిపిస్తుందని వెల్లడించింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో అయితే..ఇంకాస్త బోల్డ్‌ కామెంట్‌ చేసింది. ఆ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ వివరాలు చెప్పుకుంటూ వచ్చింది. తన అత్తగారిది బీహార్‌ అని అక్కడ సంప్రదాయాలు ఎక్కువ అని వెల్లడించింది. అక్కడ పది మందిలో కొంగు కపుపకునే ఉండాలని తెలిపింది. తాను అక్కడికి వెళితే అలాగే ఉంటానని చెప్పింది. ఇంకా అక్కడ అమ్మాయిలు రంగురంగులుగా ఉంటారని తెలిపింది. ఇక తనకు ఆడపిల్లలంటే ఇష్టమని చెప్పింది.

ఆడపిల్ల కావాలని..
తనకు ఆడపిల్లను కనాలని ఉందని ఇటీవలే తన అత్తగారికి ఓపెన్‌గా సిగ్గు విడిచి చెప్పిందట. అందుకు తన అత్తగారు కోప్పడ్డారని తెలిపింది. ఇందుకు బిహార్‌లోకి కట్టుబాట్లే కారణమని వెల్లడించింది. అక్కడ మగవాళ్ల డామినేషన్‌ ఉంటుంది తెలిపింది. తన పిల్లలకు కూడా చెల్లిని ఇస్తా అంటే తన చిన్న కొడుకు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపింది. మరి అమ్మాయిని కంటారా అని చివరకు యాంకర్‌ ప్రశ్నించగా, తనకు కనాలనే ఉందని, తన భర్త భరధ్వాజ్‌ సహకరించడం లేదని ఓపెన్‌ అయింది. ఆడపిల్ల ఉన్న ఇల్లు ప్రశాంతంగా, అణకువగా ఉంటుందని తెలిపింది.

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా..
ఇదిలా ఉండగా అనసూయ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌. ఆమెను అప్పట్లో ఆంటీ అని కామెంట్‌ చేసినందుకు పెద్ద రచ్చ చేసింది. అయినా సోషల్‌ మీడియాలో తన లేటెస్ట్, స్టైలిష్‌ ఫొటోలను షేర్‌ చేస్తూనే ఉంది. ఇటీవలే వ్యాయాం చేస్తూ తలకిందులుగా వేలాడి ఉన్న ఫొటోనూ షేర్‌ చేసింది. ఇక షాపింగ్‌ మాల్స్‌ ఓపెనింగ్స్‌లో ఇటీవల అనసూయ బిజీ అయింది. వాటికి సంబంధించిన ఫొటోలను కూడా తరచూ తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ అకౌంట్‌లలో పోస్టు చేస్తోంది.