Sriya Reddy : బ్లాక్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసే గ్లామర్.. సలార్ బ్యూటీ గ్లామరస్ లుక్ వైరల్!

మరోవైపు శ్రియా రెడ్డి గ్లామరస్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తుంది. తాజాగా బ్లాక్ డిజైనర్ వేర్ ధరించి కుర్రాళ్ళ గుండెలు కొల్లగొట్టింది.

Written By: NARESH, Updated On : April 30, 2024 9:48 pm

Sriya Reddy

Follow us on

Sriya Reddy : చేసింది తక్కువ చిత్రాలే అయినా గొప్ప పాపులారిటీ తెచ్చుకుంది శ్రియా రెడ్డి. ఈమె తెలుగు అమ్మాయి. అయితే చెన్నైలోనే పెరిగింది. దాంతో కోలీవుడ్ ద్వారా ఆమె సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ జరిగింది. విక్రమ్ హీరోగా 2002లో విడుదలైన సమురాయ్ చిత్రంలో శ్రియా రెడ్డి గెస్ట్ రోల్ చేసింది.

హీరోయిన్ గా మాత్రం ఆమెను టాలీవుడ్ పరిచయం చేసింది. హీరో రాజా నటించిన అప్పుడప్పుడు చిత్రంలో శ్రియా రెడ్డి హీరోయిన్ గా నటించింది. అలాగే శర్వానంద్-సుహానిసి కాంబోలో వచ్చిన అమ్మ చెప్పింది చిత్రంలో నటించింది.

శ్రియా రెడ్డికి ఫేమ్ తెచ్చిన చిత్రం మాత్రం తిమిరు. తెలుగులో పొగరు టైటిల్ తో ఈ చిత్రం విడుదలైంది. తెలుగు తమిళ భాషల్లో పొగరు విజయం సాధించింది. ఈ చిత్రంలో విశాల్ ని పిచ్చిగా ఇష్టపడే లేడీ విలన్ రోల్ లో అద్భుతం చేసింది. ఆమె నటన చాలా వైల్డ్ గా ఉంటుంది.

ఇక 2023 సెన్సేషన్ సలార్ లో రాధా రమ మన్నార్ అనే పవర్ ఫుల్ లేడీ పాత్రలో మెస్మరైజ్ చేసింది. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. వరల్డ్ వైడ్ రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రశాంత్ నీల్ ఆ రోల్ కి శ్రియా రెడ్డి మాత్రమే కరెక్ట్ అని సెలెక్ట్ చేశాడు.

రాధా రామ మన్నార్ మూవీ కాస్ట్యూమ్ విషయంలో ఓ రోజు దర్శకుడితోనే గొడవ వాదన చేసినట్లు శ్రియా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. శ్రియా రెడ్డి సలార్ 2లో సైతం నటిస్తున్నారు. ఆమె పాత్రకు కొనసాగింపు ఉన్న నేపథ్యంలో మరోసారి ఆమె లేడీ విలన్ గా మైండ్ బ్లాక్ చేయనుంది.

మరోవైపు శ్రియా రెడ్డి గ్లామరస్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తుంది. తాజాగా బ్లాక్ డిజైనర్ వేర్ ధరించి కుర్రాళ్ళ గుండెలు కొల్లగొట్టింది. శ్రియా రెడ్డి లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. నెటిజన్స్ కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు.