Site icon OkTelugu

Andhra Pradesh before independence : స్వాతంత్య్రానికి పూర్వం ఆంధ్రప్రదేశ్‌ ఎలా ఉందో తెలుసా.. నాటి పరిస్థితిని తెలిపే దృశ్యాలు ఇవీ..

Andhra Pradesh before independence

Andhra Pradesh before independence

Andhra Pradesh before independence  :  భారత దేశం పూర్వం స్వతంత్ర హిందూ దేశం. అనేక రాజ్యాల సమూహం. సిరిసంపదలతో తులతూగే దేశంలోని సంపద కోసం ముస్లిం రాజులు మన దేశంపై దండయాత్రలు చేశారు. సంపదను కొల్లగొట్టారు. వారి తర్వాత బ్రిటిష్‌ వారి కన్ను భారత్‌పై పడింది. సుమారు 200 ఏళ్లు భారత్‌ను పాలించారు. ఈ క్రమంలోనే భారత్‌లోకి ఇస్తాం, క్రిష్టియన్‌ మతాలు వచ్చాయి. ఇక భారత దేశ స్వాతంత్య్రం కోసం అనేక మంది బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారు. అయితే స్వాతంత్య్ర పోరాటంలో కొంత మందికే గుర్తింపు దక్కింది. అనేక పోరాటాలు, నిరసనల తర్వాత బ్రిటిష్‌ పాలకులు భారత్‌ను వీడారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. అందుకే ఈ తేదీన ప్రతీ భారతీయుడికి ముఖ్యమైన రోజు. అందరికీ పండుగ రోజు.

సంపదను కొల్లగొట్టారు..
200 ఏళ్లు పాలించిన బ్రిటిషర్లు.. మన సంపదను కొల్లగొట్టారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. మన దేశంలోని ముడి పదార్థాలను వారి దేశానికి ఎగుమతి చేస్తూ.. వారి పారిశ్రామిక ఉత్పత్తులను మన దేశానికి దుగమతి చేసి విక్రయించేవారు. దీంతో మన దేశం ఆర్థిక వ్యవస్థ క ఓలోకోలేని విధంగా దెబ్బతిన్నది. ఇక 19వ శతాబ్దం చివరల్లో భారత గ్రామీణ వ్యవస్త అమెరికా కట్టు బానిసల కన్నా హీనంగా ఉంది. అయితే స్వాతంత్య్రం రాకముందు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉందో ఈ చిత్రాలు కళ్లకు కడుతున్నాయి.

Exit mobile version