Nara Lokesh : అట్లాంటాలో లోకేష్ చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

తెలుగుజాతి గర్వపడే విధంగా అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచనలకు, ఆయన చేపట్టిన రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక విలువలకు, నూతన సంస్కరణలకు తెలుగు ప్రజల గుండెచప్పుడుగా ఉన్న తెలుగు వారి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని అమెరికాలోని అట్లాంటాలో ఆవిష్కరించబోతున్నారు.

Written By: NARESH, Updated On : October 26, 2024 9:33 pm

NTR Nara Lokesh

Follow us on

తెలుగుజాతి గర్వపడే విధంగా అన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచనలకు, ఆయన చేపట్టిన రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక విలువలకు, నూతన సంస్కరణలకు తెలుగు ప్రజల గుండెచప్పుడుగా ఉన్న తెలుగు వారి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహాన్ని అమెరికాలోని అట్లాంటాలో ఆవిష్కరించబోతున్నారు.

ఎన్.టి.ఆర్ ట్రస్ట్ అట్లాంటా.. అన్నగారి అభిమానుల వారి ఆధ్వర్యంలో అమెరికాలోని అట్లాంటా మహా నగరంలో దివ్య దీపావళి పర్వదినం గురువారం, అక్టోబర్ 31, ఉదయం 11 గంటలకు వారి మనవడు, ఆంధ్ర ప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ. నారా లోకేష్ గారు ఆవిష్కరిస్తున్నారు. ఈ శుభ సందర్భాన, వారితో పాటు ఎమ్మెల్యేలు శ్రీ. రాము వెనిగండ్ల గారు , శ్రీ. సురేష్ కాకర్ల గారు, శ్రీ యార్లగడ్డ వెంకటరావు గారు విచ్చేస్తున్న ఈ మహోత్సవంలో అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలని తానా, ఎన్టీఆర్ ట్రస్ట్ కోరింది.

ఎన్టీఆర్ ట్రస్ట్ అట్లాంటా
RSVP: https://bit.ly/NTRAtlanta