Samantha: ‘నువ్వు లేకుండా నేను ఏం చేయగలను’… చైతూని మర్చిపోలేకపోతున్న సమంత!

అమెజాన్ ప్రైమ్ సంస్థ ముంబై లో ఓ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించింది. ప్రైమ్ ఒరిజినల్ ప్రాజెక్ట్స్ లో భాగమైన నటీనటులు, టెక్నిషియన్స్ ఈ ఈవెంట్ కు హాజరయ్యారు.

Written By: S Reddy, Updated On : April 11, 2024 9:16 am

Samantha

Follow us on

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ సమంత – నాగ చైతన్య తిరిగి కలవనున్నారు అని తెగ సంబరపడిపోతున్నారు. నెటిజెన్స్ ని అంతగా ఆకర్షించిన సమంత సోషల్ మీడియా పోస్ట్ ఏంటో చూద్దాం. సమంత – నాగ చైతన్య లు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏమాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్న ఈ జంట, పెద్దలను ఒప్పించుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన నాలుగేళ్లకు విభేదాలు రావడం తో విడాకులు తీసుకుని విడిపోయారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. విడాకుల అనంతరం తొలిసారి ఒకే వేదిక పై దర్శనమిచ్చారు.

అమెజాన్ ప్రైమ్ సంస్థ ముంబై లో ఓ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించింది. ప్రైమ్ ఒరిజినల్ ప్రాజెక్ట్స్ లో భాగమైన నటీనటులు, టెక్నిషియన్స్ ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. సమంత ‘ సిటాడెల్ ‘, నాగ చైతన్య దూత వెబ్ సిరీస్లలో నటించినందుకు గాను ఈ ఈవెంట్ లో వాళ్ళు కూడా పాల్గొన్నారు. అయితే వీరిద్దరూ కలవలేదు, మాట్లాడుకోలేదు. కాగా సమంత సోషల్ మీడియాలో ఆసక్తికర విషయం పోస్ట్ చేసింది.

‘ నువ్వు లేకుండా నేనేం చేయగలను ‘ అని ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో రాసుకొచ్చింది. దీంతో సామ్ – నాగ చైతన్య తిరిగి కలవబోతున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్యను మరలవలేకున్న సమంత ఇలా కామెంట్ చేసిందని అంటున్నారు. అయితే అది జరగని పని. నాగ చైతన్య మీద కోపంగా ఉన్న సమంత ఎప్పటికీ దగ్గర కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు సమంత మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. ఆరోగ్యం సహకరించక కొద్దికాలం పాటు విరామం తీసుకుని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఆమె నటించిన ‘సిటాడెల్ ‘ వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో సమంత నటించగా, ‘ హాని బన్నీ’ టైటిల్ ఫిక్స్ చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ – సమంత జంటగా నటిస్తున్నారు. అట్లీ-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలో సమంత హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది.