HomeNews'కలియుగం'లో శ్రద్ధా శ్రీనాథ్

‘కలియుగం’లో శ్రద్ధా శ్రీనాథ్

Shraddha Srinath Kaliyugam
హీరో నాని నటించిన జెర్సీ చిత్రంలో తన స్పెల్-బైండింగ్ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నటి శ్రద్ధా శ్రీనాథ్, ప్రస్తుతం “కలియుగం” అనే తెలుగు, తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటివరకూ భారతీయ సినీ ఇండస్ట్రీ లో తెరకెక్కని అద్భుతమైన కథతో హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనుంది. అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఎన్నో యాడ్స్ కి డైరెక్టర్ గా పనిచేసిన ప్రమోద్ సుందర్ తొలిసారిగా మెగా ఫోన్ పట్టి ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. అయితే శ్రద్దా శ్రీనాథ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ “నేను కథ విన్న వెంటనే ఈ సినిమా చేయాలనీ ,అంత గొప్ప కథ ఇది అని, నాలాంటి ఒక నటికీ ఇలాంటి పాత్ర పోషించే అవకాశం ఇంత త్వరగా వస్తుందని ఊహించలేదని, అంతేకాక ఈ కథ ప్రేక్షకులకు కూడా ఒక ఫ్రెష్ కథతో ఒక గొప్ప సినిమా చూశాం అనే ఫీలింగ్ కలుగుతుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

2021 జనవరి లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్స్ లో షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాను “ఆర్ కె ఇంటెర్నేషనల్” బ్యానర్ లో కె ఎస్ రామకృష్ణ నిర్మించనున్నారు. ఇండియన్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ దగ్గర చాలా సంవత్సరాలు అసిస్టెంట్ గా పనిచేసిన రామ్ చరణ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. మిగతా నటీనటులు టెక్నీకల్ టీమ్ విషయాలు అతి త్వరలో తెలియజేస్తాం అని చిత్ర యూనిట్ తెలిపారు.

Also Read: త్రివిక్రమ్‌పై మిడ్‌ రేంజ్‌ హీరోల కన్ను

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version