Naga Chaitanya Sobhita Marriage: నాగచైతన్యతో పెళ్లి పనుల్లో శోభిత దూళిపాళ్ల..వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

ఆరెంజ్ రంగు చీరని ధరించిన ఆమె ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేయగా అవి తెగ వైరల్ గా మారింది. మిగిలిన సెలబ్రిటీస్ లాగానే ఈమె కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట విదేశాల్లో పెళ్లి చేసుకుంటుందేమో అని అందరూ అనుకున్నారు.

Written By: Vicky, Updated On : October 21, 2024 5:25 pm

Naga Chaitanya Sobhita Marriage

Follow us on

Naga Chaitanya Sobhita Marriage: అక్కినేని వారి ఇంట్లో పెళ్లి భాజాలు మోగేందుకు పనులు చకచకా మొదలయ్యాయి. శోభిత దూళిపాళ్ల తో నాగచైతన్య నిశ్చితార్థం ఆగష్టు 8వ తారీఖున జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. శోభిత బాలీవుడ్ లో స్థిరపడిన హీరోయిన్ అయినప్పటికీ, అచ్చ తెలుగు అమ్మాయి. మన హిందూ సంప్రదాయాలను తూచా తప్పకుండా అనుసరించే అమ్మాయి. అనేక సందర్భాలలో ఆమె తన పెళ్లి మన సంప్రదాయాలను మొత్తం అనుసరిస్తూ చేసుకోవాలి అని చెప్పుకొచ్చింది. దానికి తగ్గట్టుగానే ఆమె అడుగులు వేస్తుంది. పెళ్ళికి ముందు జరగాల్సిన పూజలు, కార్యక్రమాలను ఆమె మొదలు పెట్టేసింది. నేడు వైజాగ్ లోని తన నివాసానికి విచ్చేసిన శోభిత, గోధుమ రాయి పసుపు దంచడం కార్యక్రమం లో పాల్గొన్నది.

ఆరెంజ్ రంగు చీరని ధరించిన ఆమె ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేయగా అవి తెగ వైరల్ గా మారింది. మిగిలిన సెలబ్రిటీస్ లాగానే ఈమె కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట విదేశాల్లో పెళ్లి చేసుకుంటుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ హిందూ సంప్రదాయాలకు తగ్గట్టుగానే ఈమె వైజాగ్ లో పెళ్లి చేసుకోబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పెళ్లి తేదీ ఎప్పుడు, ఏ ప్రాంతంలో జరగబోతుంది అనేది అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది అక్కినేని కుటుంబం. ఈ వివాహ మహోత్సవానికి టాలీవుడ్ నటీనటులతో పాటుగా, రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించినట్టు తెలుస్తుంది.

డిసెంబర్, లేదా జనవరి మొదటి వారం లో వీళ్లిద్దరి పెళ్లి జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే శోభిత దూళిపాళ్ల పెళ్లి కోసం తన సినిమా, వెబ్ సిరీస్ల షూటింగ్స్ ని మొత్తం పూర్తి చేసుకొని ఎలాంటి ఇతర పనులు పెట్టుకోకుండా కేవలం పెళ్లి పనుల మీద మాత్రమే ఫోకస్ పెట్టింది. కానీ నాగ చైతన్య మాత్రం ఇంకా సినిమా షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి తో ‘తండేల్’ అనే చిత్రం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ‘గీత ఆర్ట్స్’ బ్యానర్ పై 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నాగ చైతన్య, సాయి పల్లవి పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. క్లైమాక్స్ సన్నివేశం మినహా మిగిలిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యిందని అంటున్నారు. నవంబర్ రెండవ వారం లో గుమ్మడి కొట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి, నాగ చైతన్య పూర్తి స్థాయి లో పెళ్లి మోడ్ లోకి రానున్నాడు. ఇటీవలే ఆయన శోభిత తో కలిసి షాపింగ్ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇంస్టాగ్రామ్ లో శోభిత ఈ ఫోటోని తన స్టోరీ లో అప్లోడ్ చేయగా, అది వైరల్ గా మారింది.