ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని పోరాడారు. పరీక్షలు రద్దయ్యే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు. దీంతో కేంద్రానికి సైతం లేఖ రాశాడు. సుప్రీంకోర్టు హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం గురువారం పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో లోకేష్ కు ట్వీట్లు పెరిగాయి. లోకేష్ చేసిన పోరాటానికి తగిన న్యాయం జరిగిందనే విషయంపై పొగుడుతూ ట్వీట్లు పెరిగాయి.
పరీక్షల రద్దు విషయంలో లోకేష్ వాయిస్ వినిపించిన మాట వాస్తవమే. విద్యార్థుల తల్లిదండ్రుల్లో లోకేష్ పట్ల సానుకూల అభిప్రాయమే వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం మొదలుపెట్టిన థ్యాంక్యూ లోకేషన్న హ్యాష్ ట్యాగ్ కు సామాన్యులు సైతం స్పందిస్తున్నారు. ఎప్పుడు సోషల్ మీడియాలో నెగెటివ్ హ్యాష్ ట్యాగ్ లతో వార్తల్లో నిలిచే లోకేష్ కు ఇది భిన్నమన అనుభవమే.
ఒక్కోసారి ప్రెస్ మీట్లలో కూడా తడబడే లోకేష్ ఇప్పుడు పాజిటివ్ దృక్పథంతో కనిపించడం మామూలే. ఎమ్మెల్సీగా నామినేట్ అయి మంత్రి పదవి చేపట్టడం కూడా వ్యతిరేకతకు ఒక కారణమే. ప్రత్యర్థులు అతడిని సోషల్ మీడియా వేదికగా అన్ పాపులర్ చేయాలని చూస్తుంటారు. అయితే ఇటీవల ఆయన తన వైఖరిలో మార్పు సాధించడంతో ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో కూడా రాటు దేలినట్లు కనిపిస్తోంది.