spot_img
HomeNewsOmicron Alert:  ఒమిక్రాన్ వల్ల వాళ్లు ప్రాణాలు కోల్పోయే ఛాన్స్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

Omicron Alert:  ఒమిక్రాన్ వల్ల వాళ్లు ప్రాణాలు కోల్పోయే ఛాన్స్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

Omicron Alert:  కరోనా వైరస్ వల్ల మన దేశంతో పాటు ఇతర దేశాల ప్రజలు సైతం తీవ్రస్థాయిలో భయాందోళనకు గురవుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి మన దేశంలో ఎక్కువగానే ఉండగా గత కొన్నిరోజుల నుంచి దేశంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మాస్క్ ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే కరోనా ముప్పును తప్పించుకునే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు.

దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 11 లక్షలకు పైగా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసులలో ఒమిక్రాన్ కేసులు 5,488 అని సమాచారం. అయితే ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఎవరైతే ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోలేదో వాళ్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఏపీలో ఇప్పటివరకు 61 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 260 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలో కరోనా కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే వ్యాక్సిన్ తీసుకోని వాళ్ల ప్రాణాలకు తీవ్రస్థాయిలో ముప్పు ఉన్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకోని వాళ్లు త్వరగా వ్యాక్సిన్ ను తీసుకుంటే మంచిది. కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకుని రెండో డోసు తీసుకోని వాళ్లు సైతం నిబంధనల ప్రకారం సెకండ్ డోస్ ను తీసుకుంటే మంచిది.

రెండు డోసుల కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తక్కువగా ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తర్వాత బాధ పడాల్సి వసుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటం గమనార్హం.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...

Jagan Mohan Reddy: జగన్ వైఖరిపై ఆ ఫ్యామిలీ తీవ్ర అసంతృప్తి!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. వారంతా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమకాలీకులు. కాంగ్రెస్ పార్టీ పతనం కావడంతో మరో ప్రత్యామ్నాయం లేక జగన్మోహన్ రెడ్డి...

YS Jagan Mohan Reddy: టిక్కెట్ లేదు.. పార్టీ కోసం పని చెయ్.. ఆ సీనియర్ కు తేల్చి...

YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. ఆ పార్టీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన...

Bhumana Karunakar Reddy : సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం… నెక్స్ట్ భూమన?!

Bhumana Karunakar Reddy : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల చుట్టూ ఇప్పుడు వివాదాలు, కేసులు, అరెస్టులు నడుస్తున్నాయి. వారి వ్యక్తిగత వ్యవహార శైలి, భూ కబ్జా ఆరోపణలు, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్...
Oktelugu Epaper
Exit mobile version