కరోనా పట్టినిల్లు చైనాలో వైరస్ తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. వైరస్ ను కట్టడి చేశామని ఆనందించేలోపే మళ్లీ కొత్త కేసులు నమోదవుతుండటంతో అధికారులు తలలు పట్టుకున్నారు. 1.5 కోట్ల మంది నివాసముండే గాంజావ్ నగరంలో 20 కొత్త కేసులు బయటపడటం అధికారుల్లో ఆందోళన రేకిత్తిస్తోంది. గత వేరియంట్ల కంటే కొత్త వేరియంట్ మరింత ప్రమాదకరమైనదని, చాలా ఉధృతంగా ఉందని చైనా అధికారులు వెల్లడించినట్లు గ్లోబల్ టైమ్స్ వార్తాపత్రిక పేర్కొంది.