25న రైతులతో ప్రధాని నరేంద్రమోడీ భేటీ

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 25న సంభాషించనున్నారు. మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి సందర్భంగా ఈనెల 25న ‘కిసాన్ సంవాద్’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇందులో ప్రధాని మోదీ మాట్లాడుతారని ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ తెలిపారు. రాష్ట్రంలోని 2500కు పైగా ప్రదేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. మరోవైపు ఆదివారం రైతులు చేస్తున్న ఆందోళనలో రాజకీయ పార్టీలు లేవని రైతు సంఘాల నాయకులు […]

Written By: Suresh, Updated On : December 20, 2020 1:33 pm
Follow us on

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 25న సంభాషించనున్నారు. మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి సందర్భంగా ఈనెల 25న ‘కిసాన్ సంవాద్’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఇందులో ప్రధాని మోదీ మాట్లాడుతారని ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ తెలిపారు. రాష్ట్రంలోని 2500కు పైగా ప్రదేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. మరోవైపు ఆదివారం రైతులు చేస్తున్న ఆందోళనలో రాజకీయ పార్టీలు లేవని రైతు సంఘాల నాయకులు బహిరంగ లేఖను కేంద్ర వ్యవసాయ మంత్రికి రాశారు. ఈ నేపథ్యంలో మోదీ ‘కిసాన్ సంవాద్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇక రైతులు చేస్తున్న ఆందోళనలు నేటితో 25వ రోజుకు చేరుకున్నాయి.