కరోనా నుంచి కోటి మంది కోలుకున్నారు

భారత్ లో కరోనా వైరస్ నుంచి కోటి మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోటి మూడు లక్షల వరకు కేసులు నమోదవగా ఇందులో కోటి మంది కోలుకోవడం విశేషం. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 20,346 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 222 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,95,278గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,50,336కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,28,083యాక్టివ్ […]

Written By: Suresh, Updated On : January 7, 2021 11:09 am
Follow us on

భారత్ లో కరోనా వైరస్ నుంచి కోటి మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోటి మూడు లక్షల వరకు కేసులు నమోదవగా ఇందులో కోటి మంది కోలుకోవడం విశేషం. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 20,346 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 222 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,03,95,278గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,50,336కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,28,083యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 1,00,16,859గా ఉంది. కాగా 24 గంటల్లో 19,587 మంది డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.