
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 46,791 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,97,064 కు చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 587 మంది వైరస్ సోకి మరణించారు. దీంతో 1,15,1970కి మరణాల సంఖ్యకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 7,48,538 యాక్టివ్ కేసులు ఉండగా.. 67,33,329 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా రికవరీ రేటు 88.63 శాతం ఉండగా మరణాల రేటు 1.52 శాతంగా ఉంది.