ఎన్సీపీ నేత సజీవదహనం..

మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత సంజ్‌షిండే కారు ప్రమాదంలో మృతి చెందారు. ముంబై-ఆగ్రా హైవేపై ఆయన కారు ప్రయాణిస్తుండగా పింపల్‌గావ్‌ బస్వంట్‌ టోల్‌ ప్లాజా సమీపంలో కారులో మంటలు లేచాయి. కారులో శానిటైజర్లు ఉండడంతో మంటలు ఒక్కసారిగా కారు మొత్తం అంటుకున్నాయి. దీంతో సంజయ్‌ మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది అక్కడికి వచ్చేలోపే పరిస్థితి అదుపు తప్పింది. మరోవైపు కారు సెంట్రల్‌ లాకింగ్‌ మెకానిజయ్‌ యాక్టివేట్‌ అయి డోర్స్‌ ఓపెన్‌ కాలేదని సంఘటనా […]

Written By: Suresh, Updated On : October 15, 2020 8:47 am
Follow us on

మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత సంజ్‌షిండే కారు ప్రమాదంలో మృతి చెందారు. ముంబై-ఆగ్రా హైవేపై ఆయన కారు ప్రయాణిస్తుండగా పింపల్‌గావ్‌ బస్వంట్‌ టోల్‌ ప్లాజా సమీపంలో కారులో మంటలు లేచాయి. కారులో శానిటైజర్లు ఉండడంతో మంటలు ఒక్కసారిగా కారు మొత్తం అంటుకున్నాయి. దీంతో సంజయ్‌ మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది అక్కడికి వచ్చేలోపే పరిస్థితి అదుపు తప్పింది. మరోవైపు కారు సెంట్రల్‌ లాకింగ్‌ మెకానిజయ్‌ యాక్టివేట్‌ అయి డోర్స్‌ ఓపెన్‌ కాలేదని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల తెలిపారు. తన పండ్ల తోట కోసం మందులను కొనేందుకు షిండే పింపాల్‌గావ్‌ వెల్లే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంజయ్‌షిండ్‌కు ప్రసిద్ధ ద్రాక్ష ఎగుమతిదారునిగా పేరుంది.