జర్నలిస్టు దారుణ హత్య

తమిళనాడులోని ఓ జర్నలిస్టు దారుణహత్యకు గురయ్యాడు. కాంచీపురం జిల్లాలోని కుండ్రత్తూర్లో మోజెస్ అనే టీవీ రిపోర్టర్ ను ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కొందరు కత్తులతో నరికి చంపేశారు. ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా అమ్ముకుంటున్నారని ఓ టీవీలో మోజెస్ వార్తలు రాశాడు. అయితే కొందరు మోజెస్ ను ఇలాంటి వార్తలు రాయవద్దని బెదిరించారు. తమదారికి అడ్డు వస్తే చంపేస్తామన్నారు. ఈక్రమంలో అతన్ని హత్య చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాగా మోజెస్ శరీరంపై 18 […]

Written By: Suresh, Updated On : November 9, 2020 3:07 pm

murderd

Follow us on

తమిళనాడులోని ఓ జర్నలిస్టు దారుణహత్యకు గురయ్యాడు. కాంచీపురం జిల్లాలోని కుండ్రత్తూర్లో మోజెస్ అనే టీవీ రిపోర్టర్ ను ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కొందరు కత్తులతో నరికి చంపేశారు. ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా అమ్ముకుంటున్నారని ఓ టీవీలో మోజెస్ వార్తలు రాశాడు. అయితే కొందరు మోజెస్ ను ఇలాంటి వార్తలు రాయవద్దని బెదిరించారు. తమదారికి అడ్డు వస్తే చంపేస్తామన్నారు. ఈక్రమంలో అతన్ని హత్య చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాగా మోజెస్ శరీరంపై 18 కత్తిపోట్లను గుర్తించినట్లు తెలిపారు. మరోవైపు జర్నలిస్టును హత్య నేపథ్యంలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.