మహారాష్ట్రలో ఘోరం: నలుగురు చిన్నారుల దారుణ హత్య..

మహారాష్ట్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో నలుగురు చిన్నారులు హత్యకు గురయ్యారు. మృతదేహాల పక్కన గొడ్డలి ఉండడంతో దానితో హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రంలోని జల్గావ్‌ జిల్లా బొర్ఖేడా ప్రాంతానికి చెందిన ముస్తాఫా అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులతో కలిసి జీవిస్తున్నాడు. భార్య మెహతాజ్‌ పెద్ద కుమారుడితో కలిసి గురువారం స్వగ్రామమైన మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌ జిల్లాకు వెళ్లింది. రోజువారీ పనుల్లో భాగంగా ముస్తాఫా శుక్రవావం వ్యవసాయ క్షేత్రానికి […]

Written By: Suresh, Updated On : October 17, 2020 12:53 pm

murderd

Follow us on

మహారాష్ట్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో నలుగురు చిన్నారులు హత్యకు గురయ్యారు. మృతదేహాల పక్కన గొడ్డలి ఉండడంతో దానితో హతమార్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్రంలోని జల్గావ్‌ జిల్లా బొర్ఖేడా ప్రాంతానికి చెందిన ముస్తాఫా అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులతో కలిసి జీవిస్తున్నాడు. భార్య మెహతాజ్‌ పెద్ద కుమారుడితో కలిసి గురువారం స్వగ్రామమైన మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌ జిల్లాకు వెళ్లింది. రోజువారీ పనుల్లో భాగంగా ముస్తాఫా శుక్రవావం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి ఇంటికి వచ్చే సరికి నలుగురు మృతహాలు ఉన్నాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్పీ ప్రవీణ్‌ ముండే ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.