గుజరాత్‌ వస్త్రపరిశ్రమలో పేలుడు: 12 మంది మృతి

గుజరాత్‌లోని వస్త్ర పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈప్రమాదంలో 12 మంది మృతి చెందారు. అహ్మదాబాద్‌ నగర శివారలో ఉన్న పారిశ్రామిక ప్రాంతమైన పిరానా పిప్లాజ్‌ రోడ్‌లో జరిగిన ఈ సంఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. ఒక బాయిలర్‌ విస్పోటనం సంభవించడంలో ప్రమాదం జరిగిందని, ఫ్కాక్టరీకి చెందిన మూడు షెడ్లూ పూర్తిగా దెబ్బతిన్నాయని అడిషనల్‌ చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ బట్‌ తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. పేలుడు ఘటనపై గుజరాత్‌ ప్రభుత్వం విచారం వ్యక్తం […]

Written By: Suresh, Updated On : November 5, 2020 1:06 pm
Follow us on

గుజరాత్‌లోని వస్త్ర పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈప్రమాదంలో 12 మంది మృతి చెందారు. అహ్మదాబాద్‌ నగర శివారలో ఉన్న పారిశ్రామిక ప్రాంతమైన పిరానా పిప్లాజ్‌ రోడ్‌లో జరిగిన ఈ సంఘటనలో 9 మందికి గాయాలయ్యాయి. ఒక బాయిలర్‌ విస్పోటనం సంభవించడంలో ప్రమాదం జరిగిందని, ఫ్కాక్టరీకి చెందిన మూడు షెడ్లూ పూర్తిగా దెబ్బతిన్నాయని అడిషనల్‌ చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ రాజీవ్‌ బట్‌ తెలిపారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. పేలుడు ఘటనపై గుజరాత్‌ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. మృతులకు ఒక్కొక్కరికి రూ. 4లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు.