హిమాచల్  ప్రదేశ్ సీఎంకు కరోనా..

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది.  ఇటీవల ఆయనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో సోమవారం పరీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ప్రస్తతం హోం ఐసోలేషన్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగానే ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటి వరకు 17వేల కేసులు నమోదయ్యయి. 248 మంది మరణించారు. కానీ ముఖ్యమంత్రికి రావడం కలకలం రేపుతోంది. అయితే ప్రమాదమేమి లేదని […]

Written By: Suresh, Updated On : October 12, 2020 3:40 pm
Follow us on

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది.  ఇటీవల ఆయనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో సోమవారం పరీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ప్రస్తతం హోం ఐసోలేషన్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగానే ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటి వరకు 17వేల కేసులు నమోదయ్యయి. 248 మంది మరణించారు. కానీ ముఖ్యమంత్రికి రావడం కలకలం రేపుతోంది. అయితే ప్రమాదమేమి లేదని వారం రోజుల నుంచి తాను స్వీయ ఐసోలేషన్లోనే ఉన్నానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా రాష్ట్ర గవర్నర్ గా తెలంగాణకు చెందిన బండారు దత్తాత్రేయ ఉన్న విషయం తెలిసిందే.