దీదీకి భారీ షాక్.. మరో ఐదుగురు రాజీనామా..

తృణమూల్ పార్టీ నుంచి మరో ఐదుగురు కీలక నాయకులు రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న సువేందర్ అధికారి రాజీనామా చేయడం కలకలం రేపింది. అయితే ఆ సమయంలో తమ పార్టీలో పని చేయని వారే రాజీనామా చేస్తున్నారని మమత అన్నారు. అయితే తాజాగా గోబిందపూర్, భామన్ గోలా, పకువాహాట్, చందాపూర్ బ్లాక్ ల అధ్యక్షులు తమ పార్టీకి రాజీనామా చేశారు. తమ […]

Written By: Suresh, Updated On : December 17, 2020 12:58 pm
Follow us on

తృణమూల్ పార్టీ నుంచి మరో ఐదుగురు కీలక నాయకులు రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న సువేందర్ అధికారి రాజీనామా చేయడం కలకలం రేపింది. అయితే ఆ సమయంలో తమ పార్టీలో పని చేయని వారే రాజీనామా చేస్తున్నారని మమత అన్నారు. అయితే తాజాగా గోబిందపూర్, భామన్ గోలా, పకువాహాట్, చందాపూర్ బ్లాక్ ల అధ్యక్షులు తమ పార్టీకి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను జిల్లా ప్రెసిడెంట్ మౌసం నూర్ కు పంపారు. వీరంతా భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.