asom chief minister
అసోం రాష్ట్ర మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి సైదా అన్వర తైమూర్ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. అస్ట్రేలియాలో తన కుమారుడి వద్ద ఉంటున్న ఆమె తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసినట్లు తెలుస్తోంది. అసోం రాష్ట్రంలో సైదా కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా 4 దశాబ్దాలకు పైగా పనిచేశారు. 1980లో మొదటి సారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1972,1978, 1983, 1991లలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సైదా మృతికి ప్రధాని మోది, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అసోం ప్రస్తుత సీఎం సర్బానద సోనోవాల్ సంతాపం ప్రకటించారు.
Also Read: మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెడితె క్రిమినల్ చర్యలు..