
నూతన చట్టాల రద్దు డిమాండ్తో ఢిల్లీ శివారుల్లో రైతుల ఆందోళన కొనసాగింది. ఈ నేపథ్యంలో రేపురైతు సంఘాల నాయకులతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. అయితే కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం మరోసారి చర్చలు జరపనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు. వ్యవసాయ చట్టాలపై రైతుల డిమాండ్లు, కేంద్రం ప్రతిపాదనలపై స్పందించే అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా సింఘు, టిక్రి, చిల్లా, ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతులు తమ నిరసన సాగిస్తున్నారు. ఈ సమావేశానికి వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో షా సమావేశమయ్యారు.