వచ్చే ఏడాది ద్వితీయార్థంలో 5జీ సేవలు : ముఖేశ్

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఆసక్తికర ప్రకటన చేశాడు. వచ్చే సంవత్సరం మద్యస్థంలో 5జీ సేవలు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ డిజిటల్ అనుసంధానం కలిగిన దేశాల్లో భారత్ ఉందని ముఖేశ్ అన్నారు. రిలయన్స్ తీసుకొచ్చే 5జీ నెటవర్క్ పూర్తి దేశీయంగా అభివ్రుద్ధి చేసిందన్నారు. వీటి హార్డ్ వేర్, టెక్నాలజీ మొత్తం దేశంలోనే సిద్ధం కానున్నాయని ముఖేశ్ తెలిపారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ […]

Written By: Suresh, Updated On : December 8, 2020 3:41 pm
Follow us on

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఆసక్తికర ప్రకటన చేశాడు. వచ్చే సంవత్సరం మద్యస్థంలో 5జీ సేవలు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన పనులు వేగవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ డిజిటల్ అనుసంధానం కలిగిన దేశాల్లో భారత్ ఉందని ముఖేశ్ అన్నారు. రిలయన్స్ తీసుకొచ్చే 5జీ నెటవర్క్ పూర్తి దేశీయంగా అభివ్రుద్ధి చేసిందన్నారు. వీటి హార్డ్ వేర్, టెక్నాలజీ మొత్తం దేశంలోనే సిద్ధం కానున్నాయని ముఖేశ్ తెలిపారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ కు ప్రతీకగా జీయో 5జీ ఉంటుందన్నారు.