
దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 38,772 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 443 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 94,31,692గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,37,139కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,46,952 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 88,47,600 గా ఉంది. కరోనా కేసులు తగ్గినట్లు కనిపిస్తున్నా ఓవరాల్ గా మాత్రం 94 లక్షల కేసులు దాటాయి. గడిచిన 24 గంటల్లో 45,333 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.