
దేశంలో కొత్తగా 38,0733 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 38,0733 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 448 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 85,91,730గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,27,059కి చేరింది. ప్రస్తతం దేశంలో 5,05,265యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 79,59,406 గా ఉంది. గత పది రోజులగా దేశంలో 40 నుంచి 50 వేల మధ్య కరోనా కేసులు నమోదగా మంగళవారం నాడు 38 వేలకు కేసులు తగ్గడంతో కాస్త ఉపశమనం లభిస్తోంది. అయితే పాజిటివ్ రేటు 5.96 శాతం ఉండగా కోలుకున్నవారి శాతం 92.56 గా ఉంది.