సుశాంత్ మరణానికి ముందు అసలేం జరిగింది?  

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యలో మరో విషయం తెలిసింది. ఇప్పటికే ఈ కేసులో డ్రగ్స్‌ మాఫియా బయటపడింది. ఇప్పుడు తాజాగా సుశాంత్‌ పెంపుడు కుక్కల పోషణకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ వార్త వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఇంట్లో చాలా వరకు క్కుక్కలను పెంచుకుంటుంటారు. అలాగే సుశాంత్‌కు కూడా తన పెంపుడు కుక్కలంటే చాలా ఇష్టమట. Also Read : శివసేనను ఫుట్ బాల్ ఆడుతున్న కంగనా ఖాళీ దొరికినప్పుడల్లా లోనావాలాలోని ఫామ్‌హౌస్‌లో ఉన్న పెంపుడు […]

Written By: NARESH, Updated On : September 7, 2020 10:01 am
Follow us on

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యలో మరో విషయం తెలిసింది. ఇప్పటికే ఈ కేసులో డ్రగ్స్‌ మాఫియా బయటపడింది. ఇప్పుడు తాజాగా సుశాంత్‌ పెంపుడు కుక్కల పోషణకు సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ వార్త వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఇంట్లో చాలా వరకు క్కుక్కలను పెంచుకుంటుంటారు. అలాగే సుశాంత్‌కు కూడా తన పెంపుడు కుక్కలంటే చాలా ఇష్టమట.

Also Read : శివసేనను ఫుట్ బాల్ ఆడుతున్న కంగనా

ఖాళీ దొరికినప్పుడల్లా లోనావాలాలోని ఫామ్‌హౌస్‌లో ఉన్న పెంపుడు శునకాలు అమర్‌‌, అక్బర్‌‌, ఆంటోనీలతో ఆడుకునేవాడు. అందుకే.. తను చనిపోయే ముందు కూడా వాటి గురించే ఆలోచించాడంట. వాటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా వాటి పోషణ కోసం డబ్బును తన సంరక్షుడు రాయీస్‌కు నగదు బదిలీ చేశాడు. ఈ విషయాన్ని తాజా రాయీసే వెల్లడించాడు.

‘జూన్‌ 14న సుశాంత్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా వార్త విని షాక్‌కు గురయ్యా. సుశాంత్‌ చాలా మంచి వ్యక్తి. సూసైడ్‌కు ముందు రోజే తన పెంపుడు కుక్కలకు అవసరమయ్యే డబ్బులను నా ఖాతాలో జమ చేశాడు. సుశాంత్‌ రెగ్యూలర్‌‌ ఫామ్‌హౌస్‌కి వచ్చేవాడు. రియా, ఆమె తండ్రి పుట్టిన రోజు వేడుకలను కూడా ఫామ్‌హౌస్‌లోనే జరిపేవారు. జనవరిలో సుశాంత్‌ పుట్టిన రోజున రియాతో కలిసి ఫామ్‌హౌస్‌కు వచ్చాడు. అతని వెంట అతని మేనేజర్‌‌ శామ్యూల్‌ మిరాండా, శ్రుతి మోదీతోపాటు పలువురు ఫ్రెండ్స్‌ వచ్చారని’ చెప్పాడు.

ఇదిలా ఉండగా.. మరో ఆసక్తికర విషయం వెల్లడించాడు రాయీసే. గతేడాది అక్టోబర్‌‌లో ఐరోపా పర్యటనకు వెళ్లిన సుశాంత్‌ అప్పటి నుంచి అనారోగ్యానికి గురయ్యాడంట. రెండు నెలలు ఫామ్‌హౌస్‌కు దూరంగా ఉన్నాడని రాయీస్‌ చెప్పారు. అయితే.. సుశాంత్‌ వాడుతున్న ఫామ్‌హౌస్‌ అతనికి కాదట. రెంట్‌కి తీసుకున్నాడని, ఏడాది తర్వాత దానిని కొనుగోలు చేసి శాశ్వతంగా అక్కడికి రావాలని అనుకున్నాడట. అక్కడే సేంద్రియ వ్యవసాయం చేయాలని భావించాడట. ఫిబ్రవరిలో చివరిసారి ఫామ్‌హౌస్‌కు వచ్చాడని, తర్వాత రెండుమూడు నెలలు అక్కడే ఉండాలని ప్లాన్ చేశాడని రాయీస్ వివరించాడు.

Also Read : ‘రాం గోపాల్‌వ‌ర్మ`‌కు యూట్యూబ్‌లో షాక్‌..!