Stock market: రూపాయి విలువ పతనం కొనసాగుతోంది. ఈరోజు విదేశీ మారకద్రవ్య మార్కెట్లో రూపాయి 94.53 వద్ద ప్రారంభమైంది. కానీ సెషన్ పురోగమిస్తుండగా క్రమంగా బలహీనపడి ప్రస్తుతం 94.68 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. దాదాపు 15 పైసల విలువ తగ్గుదల రూపాయి ప్రస్తుత స్థితిని స్పష్టంగా చూపిస్తోంది. రూపాయి ఇలా బలహీనపడటంతో దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. ప్రత్యేకించి చమురు, బంగారం, ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులు ఖరీదైనవి అవుతాయి. దీంతో ద్రవ్యోల్బణం పెరగడానికి అవకాశం ఉంది. అయితే ఎగుమతి ఆధారిత రంగాలైన ఐటీ, ఫార్మా కంపెనీలకు ఇది కొంత మేర లాభదాయకంగా మారవచ్చు.
స్టాక్ మార్కెట్లపై ప్రభావం..
రూపాయి పతనం ప్రభావం మార్కెట్లుపై పడింది. సెన్సెక్స్ ఫ్లాట్గా మొదలైనప్పటికీ, ఒక దశలో 200 పాయింట్ల వరకు నష్టాల్లోకి వెళ్లింది. తర్వాత వేగంగా రికవరీ చేసి 160 పాయింట్ల లాభాలకు చేరుకుని, మళ్లీ రెడ్ జోన్లోకి దిగజారింది. నిఫ్టీ కూడా ఇదే తరహాలో హెచ్చుతగ్గులు చూపించింది. ఇలాంటి వోలటిలిటీ సాధారణంగా గ్లోబల్ క్యూస్, విదేశీ పెట్టుబడిదారుల నిర్ణయాలు, లేదా ఆర్థిక డేటా మార్పుల వల్ల వస్తుంది. రూపాయి బలహీనత కూడా మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేస్తోంది.
రూపాయి బలహీనతకు కారణాల..
అమెరికాలో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల డాలర్ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారుతోంది. దీంతో ఇతర కరెన్సీలు బలహీనపడుతున్నాయి. చమురు ధరలు పెరిగితే భారతదేశ దిగుమతి బిల్లు పెరుగుతుంది. ఇది రూపాయిపై నేరుగా ఒత్తిడి తెస్తుంది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారతీయ స్టాక్ల నుండి నిధులు బయటకు తీసుకెళ్తుంటే రూపాయి డిమాండ్ తగ్గుతుంది. దిగుమతులు ఎగుమతుల కంటే ఎక్కువగా ఉంటే రూపాయి విలువపై నిరంతర ఒత్తిడి ఉంటుంది.
స్వల్పకాలికంగా రూపాయి మరింత బలహీనపడే అవకాశం ఉంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) అవసరమైనప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకుని రూపాయిని స్థిరపరచడానికి ప్రయత్నిస్తుంది. ఇన్వెస్టర్లు, వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలికంగా చూస్తే ఆర్థిక వృద్ధి, ఎగుమతుల పెరుగుదల, విదేశీ పెట్టుబడులు రావడం వంటివి రూపాయిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ప్రస్తుతం మార్కెట్లు అనిశ్చితంలో ఉన్నాయి కాబట్టి, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా పరిశీలించి పెట్టుబడులు చేయడం మంచిది. రూపాయి బలహీనత, మార్కెట్ల పతనం ఆర్థిక వ్యవస్థపై తాత్కాలిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి.
