Homeక్రైమ్‌Ketan Agarwal case: కేతన్ నుంచి రూ.కోటి తీసుకొని.. ప్రియుడి బిజినెస్ కోసం ఇచ్చి మరీ...

Ketan Agarwal case: కేతన్ నుంచి రూ.కోటి తీసుకొని.. ప్రియుడి బిజినెస్ కోసం ఇచ్చి మరీ కడతేర్చిన సియా

Ketan Agarwal case: పూణే స్థిరాస్తి వ్యాపారి కేతన్ అగర్వాల్ కేసు రకరకాల మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అతడికి కాబోయే భార్య సియా.. ఆమె ప్రియుడు ప్రధాన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీరిద్దరూ కలిసి కేతన్ ను చంపేసినట్టు పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు కు సంబంధించి మరిన్ని సాక్ష్యాలను… ఆధారాలను సేకరించడానికి విచారణ జరుపుకున్నారు.

ఇప్పటికే పోలీసులు సియా ప్రియుడు చేతన్ ను కోట వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సీన్ రిక్రియేషన్ చేశారు. తద్వారా మరిన్ని ఆధారాలు సేకరించారు. డమ్మీ బొమ్మలు పెట్టి.. కోట చివరి అంచున దానిని ఏర్పాటు చేశారు. కేతన్ ను ఎలా లోయలోకి తోసి వేసింది.. దానికి ముందు ఏం చేసింది.. అనే విషయాలను పూర్తిగా చేతన మాటల్లోనే తెలుసుకున్నారు. అతడు చెబుతుండగా ఆ స్టేట్మెంట్ మొత్తం రికార్డ్ చేసుకున్నారు.

ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత పోలీసులకు ఈ కేసులో మరొక కీలక విషయం తెలిసింది.. పెళ్లి నవంబర్లో జరగాల్సి ఉండగా.. దానికంటే ముందుగానే సియా కేతన్ దగ్గరనుంచి కోటి రూపాయలు తీసుకుంది. పెళ్లి ఖర్చుల కంటూ అతని ముందు బుకాయించింది. ఆ కోటి రూపాయలను సియా తన ప్రియుడు చేతన్ కు ఇచ్చింది. వారిద్దరు వేసుకున్న ప్లాన్ లో ఈ డబ్బులు వసూలు కూడా ఒక భాగమని తెలుస్తోంది.. అంతేకాదు కేతన్ ను చంపేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు వారిద్దరు సాధారణంగా ఉండాలని అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల అనంతరం పెళ్లి చేసుకోవాలని సీఎం, చేతన్ భావించారు. వాస్తవానికి సియా కేతన్ దగ్గర్నుంచి కోటి రూపాయలు తీసుకున్న తర్వాత వాటితో షాపింగ్ చేయలేదు. ఆ డబ్బులను తన ప్రియుడికి ఇచ్చింది..

చేతన్ ది అంతగా ఆర్థిక స్థిరమైన కుటుంబం కాదు. పైగా అతడు జీవితంలో స్థిరపడేందుకు చాలా సమయం పడుతుంది. దానికి పెట్టుబడి కావాలి. అందువల్లే సియా కేతన్ దగ్గర్నుంచి కోటి రూపాయలు తీసుకొని తన ప్రియుడికి ఇచ్చింది. తన ప్రియుడిని ఆర్థికంగా సెటిల్ చేయడానికి ఆమె ఈ డబ్బులు ఇచ్చినట్టు తెలుస్తోంది.. డబ్బులు తీసుకున్న తర్వాత.. అతడిని అంతం చేసేందుకు వీరిద్దరూ పకడ్బందీగా ప్రణాళికల రూపొందించారు. జూన్ 4న చంపాలని అనుకున్నారు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. జూన్ 14న మరోసారి ప్రయత్నించారు.. అది కూడా విఫలమైంది. జూన్ 18న ఈసారి పకడ్బందీగా ప్లాన్ వేసి.. కొండ చివరి అంచు వరకు తీసుకెళ్లి.. అతడిని అందులో నుంచి తోసివేశారు. అతడు చనిపోయాడు అని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి బయటికి వచ్చారు. ఆ తర్వాత డ్రామా ప్లే చేయడం మొదలుపెట్టారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version