వాహనదారులకు మోదీ సర్కార్ శుభవార్త.. అమల్లోకి కొత్త నిబంధనలు..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వాహనదారులకు శుభవార్త చెప్పింది. వాహనదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైంది. త్వరలో వాహనదారులకు నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989కు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సవరణలు చేయడానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఇకపై వాహనాలకు కూడా నామినీ ఫెసిలిటీని తీసుకురానుందని తెలుస్తోంది. Also Read: రైతులకు గుడ్ న్యూస్.. సులభంగా రూ.5 లక్షలు లోన్ పొందే ఛాన్స్..? వెహికిల్ ఓనర్ […]

Written By: Navya, Updated On : November 28, 2020 1:39 pm
Follow us on


కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వాహనదారులకు శుభవార్త చెప్పింది. వాహనదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైంది. త్వరలో వాహనదారులకు నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989కు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సవరణలు చేయడానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఇకపై వాహనాలకు కూడా నామినీ ఫెసిలిటీని తీసుకురానుందని తెలుస్తోంది.

Also Read: రైతులకు గుడ్ న్యూస్.. సులభంగా రూ.5 లక్షలు లోన్ పొందే ఛాన్స్..?

వెహికిల్ ఓనర్ షిప్ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఇకపై వాహనదారులు వాహనాలను కొనుగోలు చేసే సమయంలో ఓనర్ తో పాటు నామినీని కూడా యాడ్ చేయవచ్చు. ఒకవేళ వాహనం కొనుగోలు చేసిన సమయంలో యాడ్ చేయకపోతే ఆ తర్వాత అయినా నామినీ పేరును యాడ్ చేయవచ్చు.

Also Read: మళ్లీ లాక్ డౌన్ అంటూ జోరుగా ప్రచారం.. మూడు కోట్ల మందికి ముప్పు..?

ఈ విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కీలక మార్పులు చేయడానికి సిద్ధమైంది. వాహనదారులు రిజిస్ట్రేషన్ సమయంలో నామినీ పేరును యాడ్ చేయడం కుదరని పక్షంలో భవిష్యత్తులోనైనా నామినీ పేరును యాడ్ చేసే విధంగా కేంద్రం సవరణలు చేయనుందని సమాచారం. ఈ నిబంధనలు అమలులోకి వస్తే వాహనదారులు చనిపోతే నామినీలకు వాహనం చెందుతుంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

వాహన యజమాని డెత్ సర్టిఫికెట్ సమర్పించడం ద్వారా వాహనాన్ని సులభంగా నామినీ పేరుకు మార్చుకునే అవకాశం ఉంది. ఒకవేళ వాహనానికి నామినీ లేకపోతే యజమానికి తామే వారసులమని కుటుంబ సభ్యులు ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది.