spot_img
HomeజాతీయంKartika Gopasthami : కార్తీక గోపాష్టమి నేడే; విశిష్టత.. గోవులను పూజిస్తే కలిగే అద్భుత ఫలితమిదే!!

Kartika Gopasthami : కార్తీక గోపాష్టమి నేడే; విశిష్టత.. గోవులను పూజిస్తే కలిగే అద్భుత ఫలితమిదే!!

kartika gopasthami  : హిందూ సంస్కృతిలో కార్తీక మాసానికి ప్రత్యేకత ఉంటుంది. ఇది పూజల కాలం. ఈ నెలలో చాలా మంది ఉపవాసాలు చేస్తారు. దీపాలు వెలిగిస్తారు. దీంతో దేవుడి కృప సాధించుకోవాలని తాపత్రయపడుతుంటారు. ఇందులో భాగంగా కార్తీక మాసం శుక్ల పంక్షంలో ఎనిమిదో రోజున గోపాష్టమి వస్తుంది. ఇదినేడు రావడంతో అందరు గోవులను పూజించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ రోజు గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అని చెబుతున్నారు. దీంతో గోవులను పూజించి వాటికి ఆహారం తినిపించి తమకు మోక్షం కలగాలని భావిస్తున్నారు. కార్తీక మాసంలో మహిళలు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుతున్నారు.

శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని చిటికెన వేలు మీద ఎత్తిన రోజునే గోపాష్టమిగా చెబుతారు. భక్తులు కృష్ణుడితో పాటు గోవులను పూజించడం ఆనవాయితీ. ఈ రోజు తిరుమలలో పుష్పయాగ మహోత్సవం చేస్తారు. ఇంకా దుర్గాష్టమి వ్రతాన్ని కూడా నిర్వహిస్తుంటారు. గోపాష్టమి గురించి పురాణాలు ఇంకా ఎన్నో విషయాలు మనకు తెలియజేస్తున్నాయి. గోవులను పూజిస్తే ఇంద్రున్ని పూజించిన దానికంటే పుణ్యం ఎక్కువగా వస్తుందని చెప్పడంతో అందరు ఇంద్రునికి బదులుగా గోవులను పూజించారట. దీంతో ఇంద్రుడు కోపోద్రిక్తుడై వారం రోజుల పాటు ప్రళయం సృష్టించాడని చెబుతారు.

ఇంద్రుడి కోపం నుంచి గోవులను, గోపాలురను రక్షించే బాధ్యత తీసుకున్న కృష్ణుడు తన చిటికెన వేలుతో గోవర్థన గిరి ఎత్తి వారం రోజుల పాటు గోవులు, గోపాలురను రక్షించాడు. దీంతో ఇంద్రుడు శ్రీకృష్ణుడి మహిమలు తెలుసుకుని భగవంతుడి స్వరూపంగా భావించి శాంతిస్తాడు. అందుకే ఈ రోజును గోపాష్టమిగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ రోజు గోవులను పూజిస్తే ఆయురారోగ్యాలు, కీర్తి, ధనం అన్ని కలుగుతాయని విశ్వసిస్తారు. గోవు లక్ష్మిదేవి స్వరూపం కాడంతో పూజ చేస్తే ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు.

ఈ రోజు గోవులను భక్తులు విశిష్టంగా పూజిస్తారు. గోశాలలను సందర్శించి వాటిని శుభ్రం చేస్తారు. ఆవులను చక్కగా అలంకరించి పూజలు నిర్వహిస్తారు వాటికి ఆహారం తినిపిస్తారు సకల పాపాలు తొలగుతాయని చెబుతారు. గోపాష్టమి సందర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు గోవులను పూజించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. గోశాలలకు వెళ్లి గోవులను అలంకరించి పూజించి తమకు మంచి జరగాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గోపూజ చేసి తమ పాపాలను దూరం చేసుకోవాలని చూస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version