Thaman: సాధారణంగా మన అభిమాన హీరో సినిమా వస్తోందంటేనే సినిమాపై ఓ రేంజ్లో అంచనాలు ఉంటాయి. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తున్నారని తెలిస్తే.. ఇక వారి అభిమానులకు పండగే. ఇటీవలే కాలంలో మల్టీస్టారర్ చిత్రాలు టాలీవుడ్లో కామన్ అయ్యాయి. గోపాల గోపాల సినిమాలో పవన్, వెంకటేశ్ కలిసి నటించిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత అనేక సినిమాలు మల్టీస్టార్గా తెరకెక్కాయి. తాజాగా, మరో అప్డేట్ వచ్చింది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఓ క్రేజీ మల్టీ స్టారర్ సినిమాపై చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. సూపర్స్టార్ మహేశ్ బాబు, ప్రభాస్లను ఈ పోస్ట్లో లింక్చేస్తూ.. తమన్ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
నిన్న రాత్రి థమన్ ట్విట్టర్ వేదికగా ఓ చాట్ సెషన్ నిర్వహించారు. అందులో భాగంగా మహేశ్ 28వ ప్రాజెక్ట్పై ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ ట్వీట్ పెట్టారు. మరి థమన్ ఈ ట్వీట్ను మిస్టెక్గా పెట్టారా.. లేక నిజంగానే ప్రభాస్- మహేశ్ సినిమాలో ఉన్నాడా తెలియాల్సి ఉంది. అయితే, ఈ ట్వీట్తో ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్పై కనిపిస్తే చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ను డిలీడ్ చేశారు థమన్.
కాగా, ప్రస్తుతం మహేశ్బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కీర్తి సురేశ్ మహేశ్ సరసన నటిస్తోంది. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మరోవైపు, సలార్, ఆదిపురుష్, రాధేశ్యామ్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More