చిరంజీవి సినిమాలో లేడి అమితాబ్?

ఒకప్పటి హిట్ ఫెయిర్ మళ్లీ తెరపై కనువిందు చేయనుంది. చిరు-153 మూవీలో లేడి అమితాబ్ విజయశాంతి నటించనుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్లలో దాదాపు 20చిత్రాలు వచ్చాయి. వీటిలో దాదాపు అన్ని సినిమాలు అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి. ఆ తర్వాత విజయశాంతి రాజకీయాల్లో బీజీగా మారడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవలే విజయశాంతి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. ‘సరిలేరునికెవ్వరు’ మూవీలో భారతి క్యారక్టర్లో నటించి […]

Written By: Neelambaram, Updated On : May 27, 2020 3:24 pm
Follow us on


ఒకప్పటి హిట్ ఫెయిర్ మళ్లీ తెరపై కనువిందు చేయనుంది. చిరు-153 మూవీలో లేడి అమితాబ్ విజయశాంతి నటించనుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్లలో దాదాపు 20చిత్రాలు వచ్చాయి. వీటిలో దాదాపు అన్ని సినిమాలు అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి. ఆ తర్వాత విజయశాంతి రాజకీయాల్లో బీజీగా మారడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇటీవలే విజయశాంతి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. ‘సరిలేరునికెవ్వరు’ మూవీలో భారతి క్యారక్టర్లో నటించి మెప్పింది. విజయశాంతి రాజకీయాల్లో బీజీగా ఉన్నప్పటికీ వంశీ పైడిపల్లి చెప్పిన కథనచ్చడంతో మహేష్ బాబు చిత్రంలో విజయశాంతి నటించింది. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ ఘనవిజయం సాధించింది.

ఇక సరిలేరునికెవ్వరు’ మూవీ ప్రీ రీలీజు వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి-విజయశాంతి మధ్య నెలకొన్న పాతగొడవలు దూరమై మళ్లీ పాత స్నేహం చిగురించింది. ప్రీ రీలీజు వేడుకకు వీరిద్దరే హైలెట్ గా నిలిచారు. నాటి నుంచి చిరంజీవి-విజయశాంతి కాంబినేషన్లో ఓ మూవీ వస్తుందని ప్రచారం జరిగింది. చిరంజీవి కూడా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ‘ఖైదీ-150’తో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్టిచ్చి తనలో సత్తా తగ్గలేదని చాటారు. అలాగే చిరంజీవి డ్రిమ్ ప్రాజెక్టు ‘సైరా’ 151వ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఉయ్యాల నర్సింహారెడ్డి పాత్రలో చిరంజీవి అద్భుతంగా నటించి మెప్పించారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి-152 మూవీ ‘ఆచార్య’గా తెరకెక్కుతోంది. ఇక చిరు-153లో విజయశాంతి నటించనుందని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది.

మలయాళంలో సూపర్ హిట్టు సాధించిన ‘లూసీఫర్’ చిత్రాన్ని తెలుగులో చిరు-153 మూవీగా తెరకెక్కనుంది. ‘సాహో’ దర్శకుడు సుజిత్ ఈ మూవీని తెరకెక్కించనున్నాడు. ఈ మూవీని తెలుగు నెటివీటికి అనుగుణంగా కొన్ని మార్పులు చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ రోల్లో విజయశాంతి కన్పించనుందని ప్రచారం జరుగుతోంది. మలయాళ ఒరిజినల్ వర్షన్లో మంజువారియల్ పాత్ర ఎంతో కీలకమైనది. ఈ పాత్రలోనే విజయశాంతి నటించనుందని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది. అయితే దీనిపై చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఒకప్పటి సూపర్ హిట్ పేర్ మరోసారి తెరపై కన్పిస్తుందని తెలియడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.