గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ ఇంట్లో దంపతుల మృతదేహాలు స్థానికంగా కలకలం రేపాయి. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు తాళాలు పగులగొట్టి ఆ ఇంట్లోకి వెళ్లారు. అక్కడ రెండు మృతదేహాలను గుర్తించారు. వారు వారం కిందట ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.